వెలిమెల—తెలంగాణ: వెలిమెల గిరిజన రైతుల భూముల అక్రమ స్వాధీనంపై నెలల తరబడి జరుగుతున్న పోరాటంలో కీలక మలుపు వచ్చింది. గిరిజన రైతుల ఫిర్యాదులను పరిశీలించేందుకు ఎన్హెచ్ఆర్సి (National Human Rights Commission) వెలిమెలకు వచ్చి విచారణ చేపట్టింది. ఉదయం 8 గంటల నుంచి సాక్ష్యాలు, రికార్డులు పరిశీలన కొనసాగుతోంది.
రైతుల ఆరోపణల ప్రకారం, గత ప్రభుత్వంతో మొదలైన ఈ భూ కుంభకోణంలో రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారులు, రియల్ ఎస్టేట్ మాఫియా కలిసి వందల ఎకరాల గిరిజన భూమిని తప్పుడు పత్రాలతో స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపిస్తున్నారు.
🔻 ఎవరి పేర్లు వచ్చాయి?
రైతులు ప్రత్యక్షంగా ఆరోపిస్తున్న పేర్లు:
- మాజీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- ప్రస్తుత ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు
- అపర్ణ కన్స్ట్రక్షన్స్
- మాజీ ఆర్డిఓలు, ఎంఆర్ఓలు
- స్థానిక రాజకీయ నాయకులు
రైతుల భూములు “ధరణి పోయింది – భూమాత వచ్చింది” అంటూ ప్రచారం చేసినా, లబ్ధి మాత్రం ముఖ్య నేతల పిల్లల పేర్లకు వెళ్లిందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
🔻 హింస, బెదిరింపులు, అరెస్టులు
పోరాటం చేస్తున్న గిరిజన రైతులపై:
- భయపెట్టడం
- గృహ నిర్బంధం
- పోలీసు కేసులు
- రౌడీల దాడులు
అపరిచిత వ్యక్తుల చేతుల మీదుగా జరిగినట్లుగా వారు చెబుతున్నారు.
ఒక వ్యక్తి మరణించిన ఘటన కూడా పత్రాలలో నమోదైందని బక్క జడ్సన్ తెలిపారు.
🔻 రాజకీయ మౌనం
రైతుల మాటల్లో:
“ముఖ్యమంత్రి ఫుట్బాల్ ఆడతారు, కానీ మా సమస్యలపై ఒక్క మాట కూడా మాట్లాడరు.”
🔻 ఇప్పుడు ఆశ ఎక్కడ?
ప్రస్తుతం రైతులు ఎన్హెచ్ఆర్సి విచారణపై నమ్మకంగా ఉన్నారు.
బక్క జడ్సన్ మాట్లాడుతూ:
“Late అయినా సరే, justice latest గా రావాలి. ఎవరికైతే కూలీల కష్టంతో వచ్చిన భూమి ఉంటుందో – అది మాఫియా రియల్ ఎస్టేట్కు పోకూడదు.”

