ఎర్రగడ్డ డివిజన్లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పలు కీలక నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి మహిళా నాయకురాలు శిల్పా రెడ్డి, రాష్ట్ర మహిళ కన్వీనర్ జ్యోతి, ఎలక్షన్ ఇంచార్జ్ గౌతమ్ అన్నగారు, ప్రదీప్ అన్న, కార్పొరేటర్లు మహేందర్, నరేష్, హనుమంత్ నాయుడు, గాయత్రి గారు, విజయ్ గారు తదితరులు హాజరయ్యారు.
ప్రత్యేకంగా స్థానిక ప్రజలకు సదుపాయాలు కల్పించడంలో పార్టీ తీసుకున్న నిర్ణయాలు, ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు, గత ప్రభుత్వాల వైఫల్యాలు చర్చించబడ్డాయి.
నాయకులు ప్రజలకు చేరువ కావడం, ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ బలోపేతం చేయాలనే పిలుపునిచ్చారు.

