జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతోంది. స్థానిక ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తారని గట్టిగా విశ్వసిస్తున్నారు. బోరగొండకు చెందిన హనుమంతరావు మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు — యువకుడికి అవకాశం ఇచ్చారు. స్థానికుడు, బీసీ అభ్యర్థి, ప్రజలతో ఎప్పుడూ అందుబాటులో ఉండే నవీన్ యాదవ్ కచ్చితంగా గెలుస్తారు,” అని తెలిపారు.
ప్రజల మద్దతు ఊపందుకోవడంతో పాటు, అనేక స్థానికులు “నవీన్ అన్న” పేరుతో ర్యాలీల్లో పాల్గొంటున్నారు. “ఫేక్ ఓటర్ ఐడీల మాటలన్నీ అబద్ధాలు. స్థానికులే ఎక్కువగా ప్రచారంలో పాల్గొంటున్నారు. నవీన్ అన్న ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటాడు, అందుకే ప్రజల ప్రేమ అంతగా ఉంది,” అని మరో స్థానికుడు చెప్పారు.
మహిళల మద్దతు కూడా కాంగ్రెస్ అభ్యర్థికి భారీగా లభిస్తోందని తెలిపారు. “ఫ్రీ బస్, సబ్సిడీ గ్యాస్, కొత్త రేషన్ కార్డులు — ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులు. అందుకే మహిళలంతా నవీన్ యాదవ్కే ఓటేస్తారు,” అని వారు పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్లో ప్రస్తుతం వాతావరణం పూర్తిగా కాంగ్రెస్ వైపు ఉందని, “సానుభూతి తరహా వర్కవుట్ ఇక్కడ జరగదు — ప్రజలు స్థానిక అభ్యర్థిని కోరుకుంటున్నారు,” అని నేతలు చెబుతున్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో స్థానికుల మద్దతు నవీన్ యాదవ్ వైపు బలంగా వెళ్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన యువకుడిగా, ప్రజలతో నిరంతరం కలిసిమెలసి ఉండే నాయకుడిగా ఆయన పేరు వినిపిస్తోంది. ప్రజలు ఆయనను “స్థానికుడు – అందుబాటులో ఉన్న లీడర్”గా భావిస్తున్నారు.

