మక్కలు తడుస్తున్నాయి.. లారీలు రావట్లేదు”.. రైతుల ఆవేదనపై మండిపడుతున్న గ్రామాలు
తెలంగాణలో మక్క రైతుల పరిస్థితి దయనీయంగా మారిందంటూ పలు గ్రామాల్లో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కోసి మార్కెట్కు తీసుకొచ్చినా లారీలు రావడం లేదని, ట్రాక్టర్లు తిరగడం లేదని, వర్షాల కారణంగా మక్కలు తడిసి నష్టపోతున్నాయని రైతులు వాపోతున్నారు. “ట్రాక్టర్ దొరకడం లేదు.. లారీలు రావట్లేదు.. రోజూ బస్తాలు తిప్పడమే మా పని అయిపోయింది” అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డుల్లో రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని, పంట అమ్మకానికి…

