కోయడ రైతులకు న్యాయం చేయాలి: అరెస్టులు చేసినా పోరాటం ఆగదు – కాంగ్రెస్ నేతల ఆగ్రహం
కోయడ రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ నాయకులు తమను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారని ఆరోపించారు. రైతుల భూములను ఫ్రూట్ మార్కెట్ కోసం తీసుకున్న నేపథ్యంలో బాధిత రైతులకు తగిన పరిహారం అందించాలని కోరినందుకే తమపై చర్యలు తీసుకున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ బండారి బాలరాజు మాట్లాడుతూ, రైతుల పక్షాన నిలబడి పోరాడుతున్నందుకు తమను నేరస్తుల్లా చూసి వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పడం…

