జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో వసూళ్ల రాజా వివాదం – కాంగ్రెస్ అభ్యర్థిపై తీవ్ర ఆరోపణలు

జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో రాజకీయ వేడి చెలరేగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సోషల్ మీడియా, స్థానిక వర్గాల్లో చర్చనీయాంశమవుతున్న ఈ ఆరోపణల ప్రకారం, ఆయనను కాంగ్రెస్ పార్టీ వసూళ్ల కోసం మాత్రమే అభ్యర్థిగా నిలబెట్టిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వివాదకర వ్యాఖ్యల ప్రకారం, సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నెల ఢిల్లీలో రాహుల్ గాంధీకి పెద్ద మొత్తంలో నిధులు పంపించాలనే టార్గెట్‌ పెట్టుకున్నారని, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆర్థిక వనరులు సమకూర్చే “వసూళ్ల క్యాండిడేట్”గా నవీన్ యాదవ్‌ను ఎంపిక చేశారని ఆరోపణలు ఉన్నాయి.

వీటి ప్రకారం, జూబ్లీ హిల్స్ మరియు పరిసర ప్రాంతాల్లోని వ్యాపారవేత్తలు, సినిమా ఇండస్ట్రీ వ్యక్తుల వద్ద నుంచి వసూళ్లు జరిపి, ఆ డబ్బులు ఢిల్లీకి చేరేలా చేసే ప్రయత్నం జరుగుతుందని ఆరోపిస్తున్నారు.
ఇంకా, నవీన్ యాదవ్‌కు “రౌడీయిజం బ్యాక్‌గ్రౌండ్” ఉందని, గెలుపు సాధించిన తర్వాత జూబ్లీ హిల్స్ ప్రాంతంలో గుండాయిజం, వసూళ్లు, అల్లకల్లోలం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కంటే రాజకీయ నిధుల సమీకరణకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విమర్శకుల ప్రకారం, ఈ విధమైన అభ్యర్థులను ముందుకు తెచ్చే ప్రయత్నం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తుందని, జూబ్లీ హిల్స్ ప్రజలు ఈసారి బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు.

జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఈ ఆరోపణలతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *