దేశంలో తొలిసారి ఎన్నికల్లో డ్రోన్ల వినియోగం — జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో టెక్ సెక్యూరిటీ కొత్త అధ్యాయం
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఈసారి ఓ కొత్త సాంకేతిక ప్రయోగం జరిగి దేశవ్యాప్తంగా దృష్టి ఆకర్షిస్తోంది. దేశంలో తొలిసారిగా ఎన్నికల పర్యవేక్షణకు డ్రోన్లను వినియోగించడం విశేషం. ఎన్నికల వ్యవస్థలో టెక్నాలజీని వినియోగించి పారదర్శకత, భద్రతను పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, అన్ని డ్రోన్లను లైవ్ ఫీడ్తో అనుసంధానం చేశారు. డ్రోన్లు నిరంతరం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితులను…

