Headlines

పూణే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో విషాదం — క్యాడెట్ ఆంతరిక్ష కుమార్ సింగ్ అనుమానాస్పద మరణం

పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో (NDA) ఘోర విషాదం చోటుచేసుకుంది. లక్నోకు చెందిన 18 ఏళ్ల క్యాడెట్ ఆంతరిక్ష కుమార్ సింగ్ ఉరివేసుకొని చనిపోయాడనే వార్త ఆర్మీ వర్గాలను మరియు అతని కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటన అక్టోబర్ 10న జరిగింది. అయితే ఇది ఆత్మహత్య కాదని, తన కొడుకును హత్య చేశారని ఆంతరిక్ష తల్లి సీమా సింగ్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. చనిపోయే రెండు రోజుల ముందే తన కొడుకుతో మాట్లాడినప్పుడు ఎటువంటి…

Read Full News

హర్యాణాలో సీనియర్ ఐపీఎస్ పూరణ్ కుమార్ ఆత్మహత్య — కుల వివక్ష ఆరోపణలతో సంచలనం

హర్యాణాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పూరణ్ కుమార్ తన సొంత రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. పూరణ్ కుమార్ 2001 బ్యాచ్‌ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం హర్యాణాలో ఏడీజీపీగా పనిచేస్తున్నారు. దళిత వర్గానికి చెందిన ఆయన విద్యలో ప్రతిభావంతుడు, ఐఐఎం అహ్మదాబాద్‌ నుండి కంప్యూటర్ సైన్స్‌లో చదువుకున్నారు. నిజాయితీ, క్రమశిక్షణతో పేరు తెచ్చుకున్న ఈ అధికారి, పై అధికారుల వేధింపులతో జీవితాన్ని ముగించారు….

Read Full News

షేక్‌పేట్ ప్రజల ఆవేదన – 15 ఏళ్లుగా పరిష్కారం లేని డ్రైనేజ్ సమస్యపై ఫిర్యాదులు ఫలించలేదు

హైదరాబాద్ నగరంలోని షేక్‌పేట్ ప్రాంత ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి, మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు తెలియజేసినా పరిష్కారం దొరకలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు చెబుతున్న ప్రకారం, వర్షం వచ్చినప్పుడల్లా నీరు ఇళ్లలోకి ప్రవేశించి జీవనాన్ని దెబ్బతీస్తోంది. డ్రైనేజ్ నీరు వీధులంతా వ్యాపించి దోమలు, రోగాలు విస్తరిస్తున్నాయని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రజలు చెబుతున్న దాని ప్రకారం, “మేము చిన్నప్పటి నుంచే ఇక్కడే ఉంటున్నాం. ముప్పై సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం…

Read Full News

కేసీఆర్ రిసార్ట్స్‌లో పోలీస్ దాడి – 76 మంది అదుపులో

హైదరాబాద్‌లో మరో సంచలన సంఘటన వెలుగులోకి వచ్చింది. నమ్మదగిన సమాచారంతో పోలీసులు కేసీఆర్ రిసార్ట్స్‌లో అక్రమ పార్టీ జరుగుతుందని సమాచారం అందుకుని రాత్రి 8:30 ప్రాంతంలో దాడి నిర్వహించారు. పోలీసుల ప్రకారం, రిసార్టులో రెండు వేర్వేరు గ్రూపులు లిక్కర్ పార్టీ నిర్వహించాయి. “వేద అగ్రీ” అనే సీడ్స్ కంపెనీకి చెందిన తిరుపతి రెడ్డి, తన డీలర్లతో కలిసి పార్టీ ఏర్పాటు చేశాడు. లిక్కర్, మహిళలతో డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. మరో రూమ్‌లో “రాక్…

Read Full News

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మాగంటి సునీత విజయం – కేసీఆర్ పునరాగమనానికి మొదటి అడుగు: బిఆర్ఎస్ నేత

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ నేతలు ఉత్సాహంగా స్పందించారు. స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణంతో ఏర్పడిన ఖాళీని పూడ్చేందుకు ఆయన సతీమణి మాగంటి సునీత గోపీనాథ్ గారిని అభ్యర్థిగా ప్రకటించారు. పార్టీ తరఫున మాట్లాడిన నాయకులు పేర్కొంటూ, “మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి పేదలకు, బలహీన వర్గాలకు విశేష సేవలు అందించారు. ఆయన స్థానంలో సునీత గారిని అభ్యర్థిగా నిలబెట్టడం కుటుంబానికి, ప్రజలకు అండగా నిలబడాలనే…

Read Full News

గ్రూప్–1 అక్రమాలపై ఆగ్రహం – ప్రభుత్వాన్ని రీ–ఎగ్జామినేషన్‌కు డిమాండ్ చేసిన నిరుద్యోగులు!

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్–1 నియామకాలపై నిరుద్యోగుల ఆగ్రహం రోజు రోజుకు పెరుగుతోంది. ఇటీవల హైదరాబాదులో నిర్వహించిన సమావేశంలో పలువురు విద్యార్థులు, నిరుద్యోగ నేతలు మరియు రాజకీయ ప్రతినిధులు తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రసంగంలో మాట్లాడుతూ స్పీకర్లు, “గ్రూప్–1 పరీక్షల్లో విస్తృతంగా అవినీతి జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ధైర్యంగా ఉంటే వెంటనే పరీక్షలను రద్దు చేసి రీ–ఎగ్జామినేషన్ నిర్వహించాలి,” అని డిమాండ్ చేశారు. వార్తల్లోకి వచ్చిన ప్రసంగంలో నేతలు పేర్కొన్న ముఖ్యాంశాలు: నిరుద్యోగ నేతలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర…

Read Full News

బర్త్డే వైబ్.. మెస్మరైజ్ చేస్తున్న బుట్టబొమ్మ ! 

                  బుట్టబొమ్మ.. ఈ పేరుకు పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన అలా వైకుంఠపురంలో సినిమాలో, తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకొని.. బుట్టబొమ్మగా పేరు సొంతం చేసుకుంది పూజా హెగ్డే. తన నటనతో , అమాయకత్వంతో ఎంతోమంది అభిమానుల హృదయాలు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ ఏడాదికి 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా…

Read Full News

ఉత్తరప్రదేశ్‌లో విషాదం – రైల్వే ట్రాక్ దాటుతుండగా యువకుడిని రైలు ఢీకొట్టి మృతి!

ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ దాటుతుండగా ఓ యువకుడిని రైలు ఢీకొట్టి చంపేసిన సంఘటన గ్రేటర్ నోయిడా పరిధిలోని దాద్రి ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తుషార్ అనే యువకుడు తన బైక్‌పై రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించాడు. అయితే రైల్వే గేట్ మూసివేసి ఉన్నప్పటికీ అతను నిర్లక్ష్యంగా దానిని దాటే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి పడిపోవడంతో దాన్ని…

Read Full News

నితిన్ కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్ – లిటిల్ హార్ట్స్ దర్శకుడు సాయి మార్తాండ్ తో కామెడీ డ్రామా ప్లాన్!

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం తన కెరీర్‌లో ఒక బిగ్ కం బ్యాక్ కోసం చూస్తున్నారు. గతంలో భీష్మా వంటి హిట్ సినిమా ఇచ్చిన తర్వాత, రాబిన్ హుడ్, తమ్ముడు వంటి చిత్రాలు ఆశించినంత స్థాయిలో ఆడకపోవడంతో మంచి విజయానికి ఎదురుచూస్తున్నారు. ఇటీవల నితిన్ తన బ్లాక్‌బస్టర్ ఇష్క్ దర్శకుడు విక్రమ్ కె. కుమార్‌తో మళ్లీ పనిచేయబోతున్నారని వార్తలు వచ్చినా, ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతం పక్కన పెట్టారు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, లిటిల్ హార్ట్స్ మూవీతో…

Read Full News

అఖండా 2 కోసం తమన్ స్పెషల్ ప్లాన్ – ఇద్దరు పండితులతో కలిసి బిగ్ మ్యూజికల్ మేజిక్ సిద్ధం!

టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన తమన్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన సంగీతం ఉన్న సినిమాలు రాకముందే హడావుడి చేస్తుంటాయి. ఇటీవల ఆయన సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తమన్ ఇద్దరు ప్రసిద్ధ పండితులు — శ్రావణ్ మిశ్ర మరియు అతుల్ మిశ్రలతో ఉన్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటో చూసిన నెటిజన్లు, “ఇది అఖండా 2 కోసం ప్రత్యేకంగా చేస్తున్న…

Read Full News