Headlines

118 మ్యాజిక్ ఫిగర్‌తోనే రండి.. విజయ్‌కు మరోసారి గవర్నర్ నో

తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం అత్యంత ఉత్కంఠభరితంగా మారాయి. అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ టీవీకే అధినేత Vijay ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇంకా దక్కని పరిస్థితి నెలకొంది. రెండోసారి గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా, గవర్నర్ మరోసారి నిరాకరించినట్లు సమాచారం. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 118. ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలుచుకోగా, విజయ్ రెండు స్థానాల్లో విజయం సాధించడంతో ఒక స్థానానికి రాజీనామా చేస్తే…

Read More

సేవ్ కేబీఆర్ పార్క్”.. చెట్ల నరికివేతపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి పేరుతో ప్రభుత్వం వేలాది చెట్లను తొలగిస్తోందని ఆరోపిస్తూ పర్యావరణ పరిరక్షణ వాదులు, రాజకీయ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. “అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక లెక్క, హైదరాబాద్‌లో మరో లెక్కనా?” అంటూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌కు ఊపిరితిత్తుల్లాంటి కేబీఆర్ పార్క్‌ను దెబ్బతీసేలా చర్యలు జరుగుతున్నాయని విమర్శకులు అంటున్నారు. పార్క్‌లో నివసించే పక్షులు, జంతువుల భవిష్యత్తు ఏమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఫ్లైఓవర్లు, రోడ్ల…

Read More

మహిళలకు భద్రత ఎక్కడ సార్?”.. సీఎం స్పందన కార్యక్రమంపై మహిళ ఆవేదన

ఇటీవల నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మహిళల భద్రత, మహిళా సాధికారతపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఓ మహిళ సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మహిళలు ఆర్థికంగా ఎదగాలంటే వారికి భద్రత, స్వేచ్ఛ, ప్రోత్సాహం అవసరమని సీఎం చెప్పిన మాటలు తనకు ఎంతో నచ్చాయని ఆమె పేర్కొన్నారు. అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను సామాజిక బాధ్యతతో అక్రమ ప్రకటన బోర్డులు,…

Read More

కరీంనగర్ దాడి ఘటన.. నాయకుల మాటలతో కార్యకర్తల భవిష్యత్తు బలి?

కరీంనగర్‌లో చోటుచేసుకున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి ఘటన తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన డ్రగ్స్ వ్యాఖ్యలు, వాటికి బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఘాటు కౌంటర్ తర్వాత రాజకీయ ఉద్రిక్తత ఒక్కసారిగా హింసాత్మకంగా మారిన పరిస్థితి కనిపించింది. ఈ ఘటనలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై దాడి జరగడం, వాహనాలు ధ్వంసం కావడం, రాళ్లు కర్రలతో దాడులు…

Read More

గాంజా మహమ్మారిపై జనగర్జన.. యువతను కాపాడాలంటే సమాజం మొత్తం ముందుకు రావాలి

గాంజా అనే మత్తు పదార్థం యువత జీవితాలను నాశనం చేస్తోందని, దీనిపై ప్రభుత్వం మాత్రమే కాకుండా సమాజం మొత్తం పోరాడాలని సామాజిక కార్యకర్త నాగరాజు అన్నారు. గాంజా నియంత్రణపై నిర్వహించిన “జనగర్జన” కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గాంజా సాగు దశలోనే అరికట్టగలిగితే మార్కెట్ దాకా రాకుండా నియంత్రించవచ్చని చెప్పారు. గాంజా అనేది సాధారణంగా పొలాలు, తోటల్లో రహస్యంగా పండిస్తారని, కొన్ని ప్రాంతాల్లో మిరప పంటల మధ్య సాగు చేస్తూ వాసన బయటపడకుండా చూస్తారని ఆయన వివరించారు. పక్క…

Read More

“నిజం కోసం.. జనం కోసం”.. ఓకే టీవీ ఐదేళ్ల ప్రస్థాన గీతం వైరల్

నిజం కోసం.. జనం కోసం” అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఓకే టీవీ తన ఐదేళ్ల ప్రస్థానాన్ని ప్రతిబింబించే ప్రత్యేక గీతాన్ని విడుదల చేసింది. ప్రస్తుతం ఈ గీతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజల సమస్యలను ప్రశ్నించే వేదికగా, అన్యాయంపై అక్షర యుద్ధం చేసే మీడియా సంస్థగా తమ ప్రయాణాన్ని ఈ గీతంలో ప్రతిబింబించారు. “ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక ఓకే టీవీ”, “శ్రవ్య స్వరం.. సమరభా స్వరం” వంటి పదాలతో రూపొందిన ఈ గీతం…

Read More

రిటైర్డ్ ఉద్యోగుల ఆవేదన.. “మా డబ్బులే ఇవ్వట్లేదు, ప్రభుత్వం చిట్‌ఫండ్‌లా వ్యవహరిస్తోంది”

తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సమస్య మరింత తీవ్రరూపం దాల్చుతోంది. రిటైర్మెంట్ అనంతరం నెలల తరబడి తమకు రావాల్సిన జీపీఎఫ్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, పీఆర్సీ అరియర్స్, గ్రాట్యుటీ తదితర బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయల సాధన కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవదాసు మాట్లాడుతూ, “నేను ఏప్రిల్ 2025లో రిటైర్ అయ్యాను. రిటైర్ అయ్యి ఏడాది పూర్తవుతోంది. జూన్‌లోనే అన్ని బిల్లులు…

Read More

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలపై ఆగ్రహం.. తెలంగాణలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ఉందంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత ఎనిమిది నెలలుగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, కమిటెడ్ ఎక్స్‌పెండిచర్, పెండింగ్ బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని పలువురు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సాధారణంగా ఉద్యోగి రిటైర్ అయ్యే నెల రోజుల ముందే అన్ని బకాయిలు సిద్ధం చేసి, రిటైర్మెంట్ అనంతరం చెల్లించాల్సి ఉంటుందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇటీవల రిటైర్డ్ ఆర్ఎస్ఐ భిక్షపతి మరణం ఈ…

Read More

వడ్ల కొనుగోళ్లలో రైతుల అవస్థలు.. 20 రోజులైనా తూకం లేదు, బీ గ్రేడ్ పేరుతో కోతలు

తెలంగాణలో వడ్ల కొనుగోళ్ల వ్యవహారం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వడ్లు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి 20 నుంచి 25 రోజులు గడిచినా తూకం వేయకపోవడం, బీ గ్రేడ్ పేరుతో భారీ కోతలు విధించడం, రైస్ మిల్లర్ల ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల మాటల్లో చెప్పాలంటే పరిస్థితి మరింత దారుణంగా ఉందంటున్నారు. “మార్చి 20న వడ్లు తీసుకొచ్చాం. ఇప్పటికి 20 రోజులు దాటిపోయాయి. కొన్ని చోట్ల 24…

Read More

కరోనా కంటే కాంగ్రెస్ డేంజర్

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ K. T. Rama Rao కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి Revanth Reddyపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వరంగల్‌లో నిర్వహించిన రైతు సమగ్ర సంగ్రామ సదస్సులో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ పార్టీని కరోనా వైరస్ కంటే ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.కేటీఆర్ మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు.. రెన్యూవల్ సీఎం. ప్రతి నెల ఢిల్లీకి కప్పం కట్టి తన కుర్చీని కాపాడుకుంటున్నారు” అంటూ ఎద్దేవా చేశారు….

Read More