Headlines

తెలంగాణలో శాంతిభద్రతలు ఆందోళనకరం”.. పోలీసింగ్‌పై ప్రభుత్వానికి హెచ్చరికలు

తెలంగాణలో ప్రస్తుతం శాంతిభద్రతల పరిస్థితిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఒకప్పుడు దేశంలోనే అత్యుత్తమ పోలీసింగ్ వ్యవస్థగా గుర్తింపు పొందిన తెలంగాణ పోలీస్ శాఖ ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న నేర ఘటనలు, మహిళల భద్రతపై వస్తున్న ప్రశ్నలు, రాజకీయ వేదింపుల ఆరోపణలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై ఆందోళన పెంచుతున్నాయి. విమర్శకులు మాట్లాడుతూ.. “తెలంగాణ సాధించుకున్నది కేవలం భౌగోళిక రాష్ట్రం కోసం కాదు.. ప్రశాంతమైన సమాజం,…

Read More

రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ?”.. రేవంత్ ప్రభుత్వంపై నిరుద్యోగుల ఆగ్రహం

తెలంగాణలో నిరుద్యోగుల సమస్య మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా “రెండు లక్షల ఉద్యోగాలు” భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు నిరుద్యోగులను పూర్తిగా నిరాశపరిచిందని ఆరోపిస్తున్నారు. నిరుద్యోగులు మాట్లాడుతూ.. “మాకు మంత్రి పదవులు కావు, ఎమ్మెల్యే పోస్టులు కావు.. కేవలం ఉద్యోగాలు కావాలి” అని స్పష్టం చేస్తున్నారు. ఉద్యోగ నియామకాల విషయంలో ప్రభుత్వం…

Read More

హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్”.. డీజీపీ భార్య హత్య ఘటనపై ప్రభుత్వంపై విమర్శలు

హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందా?.. డీజీపీ భార్య హత్య ఘటనపై రాజకీయ దుమారం హైదరాబాద్ నగరంలో జరిగిన మాజీ డీజీపీ కుటుంబానికి చెందిన మహిళ హత్య కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నగర నడిబొడ్డున ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి భార్య హత్యకు గురికావడం, నిందితులు ఇంకా పట్టుబడకపోవడం పై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తీవ్రంగా టార్గెట్ చేస్తున్నాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిందని ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ…..

Read More

కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్.. “రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి మీది కాదు”

తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని కేటీఆర్ మాట్లాడిన మాటలపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. “రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి మీది కాదు.. ముందుగా మీ పాలనలో చేసిన తప్పులకు సమాధానం చెప్పండి” అంటూ తీవ్రంగా కౌంటర్లు ఇస్తున్నారు. కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను మోసం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు….

Read More

రైతుని రాజు చేస్తామన్నారు.. రోడ్డుపై కూర్చోబెట్టారు” – వరి కొనుగోళ్లపై రైతుల ఆవేదన

తెలంగాణలో వరి కొనుగోళ్ల వ్యవహారం మరోసారి రైతుల ఆగ్రహానికి కారణమైంది. కొనుగోలు కేంద్రాల్లో బస్తాల కొరత, కాంటాలు లేకపోవడం, ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడం, వర్షాలకు వరి తడవడం వంటి సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. “రైతుని రాజు చేస్తామన్నారు.. కానీ రోడ్డుపై కూర్చోబెట్టారు” అంటూ ప్రభుత్వంపై రైతులు మండిపడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి వరి పోసి కాపలా కాస్తున్నామని రైతులు చెబుతున్నారు. “నెల ఏడో తారీఖు నుంచి ఇక్కడే ఉన్నాం. ఇప్పటికీ కొనేవాళ్లు…

Read More

హైదరాబాద్‌లో కామన్ టికెట్ సిస్టమ్.. మెట్రో, ఎంఎంటీఎస్, బస్సులకు ఒకే టికెట్

హైదరాబాద్ నగర ప్రజా రవాణాలో భారీ మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇకపై ఎంఎంటీఎస్ రైళ్లు, మెట్రో రైలు, టీజీఎస్ఆర్టీసీ బస్సులకు ఒకే టికెట్ విధానం తీసుకురావడానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తోంది. నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడం, ప్రజా రవాణా వినియోగాన్ని పెంచడం, ప్రయాణికులకు సులభతరం చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంఎంటీఎస్, మెట్రో, బస్సులు వేర్వేరుగా పనిచేస్తుండటంతో ప్రయాణికులు ఒక్కో సేవకు ఒక్కో టికెట్ తీసుకోవాల్సిన పరిస్థితి…

Read More

బీఆర్ఎస్ నేతపై కేసులు.. “ప్రశ్నిస్తే జైలు పెడుతున్నార” అంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి అరెస్టులు, కేసులు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు హాట్ టాపిక్‌గా మారాయి. బీఆర్ఎస్ నాయకుడు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కాంట్రాక్ట్ వ్యవహారంలో సీబీఐ విచారణ కోరినందుకే తనపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆరోపించారు. సీతక్కను ప్రశ్నిస్తూ అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కాంట్రాక్ట్‌పై సీబీఐ విచారణ జరపాలని అడిగానని, అదే కారణంగా తనను 16 రోజుల పాటు జైలులో పెట్టారని అన్నారు….

Read More

హుస్నాబాద్‌లో షాకింగ్ ఘటన.. మహిళల ఫోటోలు మార్ఫింగ్ చేసిన విద్యుత్ శాఖ ఉద్యోగి అరెస్ట్

నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ.సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. విద్యుత్ శాఖ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మహేష్ అనే ఉద్యోగి మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకర వీడియోలు, చిత్రాలు తయారు చేసిన ఘటన బయటపడింది. ఈ కేసులో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హుస్నాబాద్ విద్యుత్ శాఖ డీఈ కార్యాలయంలో గత తొమ్మిదేళ్లుగా మహేష్…

Read More

రిటైర్డ్ ఏపీ డీజీపీ ఇంట్లో దారుణం.. తనుజా రంజన్ హత్య కేసులో నేపాలీ గ్యాంగ్ కోణం?

నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ.హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన రిటైర్డ్ ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ వినయ్ రంజన్ రే గారి కుటుంబంలో జరిగిన దారుణ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య తనుజా రంజన్ గారు హత్యకు గురైన ఘటనపై పోలీసులు అత్యంత సీరియస్‌గా దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది “మర్డర్ ఫర్ గేన్” కేసు అయ్యి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటన తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయంలో జరిగినట్టు…

Read More

తెలంగాణ కాంగ్రెస్‌పై ఏఐసీసీ ఫోకస్.. మంత్రివర్గంలో భారీ మార్పుల సంకేతాలు?

నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ.తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కేరళ, తమిళనాడు ప్రభుత్వాల ఏర్పాటు ప్రక్రియలో బిజీగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానం.. ఆ ప్రక్రియ పూర్తయ్యాక పూర్తిస్థాయిలో తెలంగాణపై దృష్టి పెట్టబోతుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా మంత్రివర్గ ప్రక్షాళన, శాఖల మార్పులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం, పార్టీ-ప్రభుత్వ సమన్వయం వంటి అంశాలపై ఏఐసీసీ సీరియస్‌గా ఫోకస్ పెట్టినట్టు సమాచారం. సీఎం రేవంత్…

Read More