హైదరాబాద్కు గ్రౌండ్ వాటర్ డేంజర్ బెల్.. భూగర్భ జలాలను పీల్చేస్తున్న బోర్లు!
హైదరాబాద్ నగరానికి భూగర్భ జలాల విషయంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన డైనమిక్ గ్రౌండ్ వాటర్ అసెస్మెంట్ నివేదిక ప్రకారం నగర పరిధిలో భూగర్భ జలాల వినియోగం ప్రమాదకర స్థాయికి చేరుకుందని వెల్లడైంది. అధికంగా బోర్లు తవ్వడం, విచ్చలవిడిగా నీటిని తోడేయడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన నీటి కొరత ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నివేదిక ప్రకారం గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని 32 ప్రాంతాలు ఆందోళనకర పరిస్థితిలో ఉన్నాయి….

