శ్రీరామనవమి రోజున కొత్త పార్టీ ప్రకటించనున్న కవిత – ‘తెలంగాణ ప్రజా జాగృతి’ రాజకీయాల్లో కొత్త మలుపా?
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కొత్త పార్టీని ఈ నెల 27న, శ్రీరామనవమి సందర్భంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు తన స్వగృహం నుంచే పార్టీ పేరును అధికారికంగా ప్రకటించనున్నారని జాగృతి వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావానికి సంబంధించిన పూర్తి కార్యాచరణ, భవిష్యత్…

