రైతు బంధు, 24 గంటల ఉచిత కరెంట్, రైతు బీమాను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది” – బీఆర్ఎస్ విమర్శలు

తెలంగాణలో రైతుల సంక్షేమం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన రైతు సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా బలహీనపరుస్తూ రైతులను ఇబ్బందుల్లోకి నెట్టిందని ఆరోపించింది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని పేర్కొంటూ, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మూడు గంటల విద్యుత్ సరిపోతుందనే దిశగా రైతులను తీసుకెళ్తోందని విమర్శించింది. రైతు కమిషన్ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, రైతు డిస్కం…

Read More

కేంద్రం కొన్నంతే ధాన్యం కొనుగోలు.. రైతుల్లో ఆందోళన రేపుతున్న సర్కార్ నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఎంత మేర ధాన్యం, ఇతర పంటలను కొనుగోలు చేస్తే అంత మేరకే రాష్ట్రం కూడా రైతుల నుంచి సేకరణ చేపడుతుందని ప్రకటించడం రైతుల్లో ఆందోళనకు దారితీస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఇన్ఫార్మల్ క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు వెల్లడించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం నిర్దేశించిన విధి విధానాల ప్రకారం పంటల కొనుగోళ్లు…

Read More

మాటలు మాత్రమే.. రైతు జీవితంలో మార్పు లేదు” – రైతుల ఆవేదన

ప్రభుత్వాలు రైతుల కోసం ఎన్నో హామీలు ఇస్తున్నప్పటికీ భూమి స్థాయిలో మాత్రం పరిస్థితులు మారడం లేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “మాటలే ఎక్కువ.. చేతల్లో మాత్రం ఏమీ కనిపించడం లేదు” అంటూ రైతులు తమ అసంతృప్తిని వెల్లడిస్తున్నారు. ఒక రైతు మాట్లాడుతూ, “ఆ రోజు కూడా ధాన్యం అమ్మడానికి చాలా ఇబ్బందులు పడ్డాం. యార్డ్ దొరకలేదు, గంటల తరబడి లైన్లలో నిలబడ్డాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. రైతు పరిస్థితి మారలేదు” అని వాపోయాడు….

Read More

ధాన్యం కొనుగోళ్లపై రైతుల ఆగ్రహం.. మార్కెట్ యార్డులో అధికారులను నిలదీసిన రైతులు

ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యం, మార్కెట్ యార్డుల్లో సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి మండలంలోని మార్కెట్ యార్డులో రైతులు అధికారులను నిలదీస్తూ తీవ్ర వాగ్వాదానికి దిగిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. “రైతులు పంట పండించడానికి ఆరు నెలలు కష్టపడతారు.. ఇప్పుడు వర్షాలు పడితే ధాన్యం తడిసి మొలకెత్తే ప్రమాదం ఉంది.. ఇంకో నెల రోజులు వేచి చూడమంటారా?” అంటూ రైతులు అధికారులను ప్రశ్నించారు. మార్కెట్‌లో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా…

Read More

10 రోజులుగా కాంటాలు లేవు.. ధాన్యంతో రైతుల నిరీక్షణ

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఇబ్బందులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రోజుల తరబడి ధాన్యం తీసుకొచ్చి వేచి చూస్తున్నప్పటికీ కాంటాలు వేయకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండో తేదీన ధాన్యం తీసుకొచ్చి పెట్టినా ఇప్పటివరకు సరైన స్పందన లేదని రైతులు ఆరోపిస్తున్నారు. “రెండో తారీకు ధాన్యం తీసుకొచ్చాం. ఇప్పటికి పది రోజులు దాటిపోయాయి. కానీ కాంటాలు మాత్రం వేయడం లేదు. చైర్మన్ కూడా పట్టించుకోవడం లేదు” అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు…

Read More