10 రోజులుగా కాంటాలు లేవు.. ధాన్యంతో రైతుల నిరీక్షణ
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఇబ్బందులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రోజుల తరబడి ధాన్యం తీసుకొచ్చి వేచి చూస్తున్నప్పటికీ కాంటాలు వేయకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండో తేదీన ధాన్యం తీసుకొచ్చి పెట్టినా ఇప్పటివరకు సరైన స్పందన లేదని రైతులు ఆరోపిస్తున్నారు. “రెండో తారీకు ధాన్యం తీసుకొచ్చాం. ఇప్పటికి పది రోజులు దాటిపోయాయి. కానీ కాంటాలు మాత్రం వేయడం లేదు. చైర్మన్ కూడా పట్టించుకోవడం లేదు” అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు…

