మెట్రో ఆస్తులపై సీఎం కన్ను.. ప్రజలపై వేల కోట్ల అప్పుల భారం: కేటీఆర్ ఆరోపణలు
సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ మెట్రో అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సేర్లింగంపల్లి బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడిన ఆయన, మెట్రోకు సంబంధించిన వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులపై ప్రభుత్వం కన్నేసిందని విమర్శించారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న సుమారు 250 ఎకరాల భూములు, దాదాపు రూ.30 వేల కోట్ల విలువైన ఆస్తులను లక్ష్యంగా చేసుకుని…

