బహదూర్‌గూడ రైతులకు హైకోర్టు ఊరట.. భూముల్లో జోక్యం వద్దని ప్రభుత్వానికి ఆదేశాలు

బహదూర్‌గూడ రైతులకు హైకోర్టు మధ్యంతర ఊరట.. భూముల్లో జోక్యం వద్దని ప్రభుత్వానికి ఆదేశాలు హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడలోని వివాదాస్పద భూముల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు నలుగురు రైతులకు మధ్యంతర ఊరట కల్పించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సంబంధిత భూముల్లో ఎలాంటి జోక్యం చేసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే సమయంలో హైడ్రా అధికారుల తీరుపై కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని…

Read Full News

శంషాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ భూసేకరణ వివాదం.. మహిళా రైతుల అరెస్టులు, నాన్-బెయిలబుల్ కేసులు కలకలం

శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం జరుగుతున్నట్లు చెబుతున్న భూసేకరణ మరోసారి వివాదానికి దారితీసింది. తాము దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములను కోల్పోతామనే ఆందోళనతో నిరసన చేపట్టిన రైతులను పోలీసులు అర్థరాత్రి అదుపులోకి తీసుకోవడం, మహిళా రైతులపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 650 ఎకరాల భూమిపై వివాదం బాధిత రైతుల కథనం ప్రకారం, శంషాబాద్ మండలంలోని సర్వే నంబర్లు 28, 62 పరిధిలో ఉన్న సుమారు 650 ఎకరాల భూమిని…

Read Full News