20 నిమిషాల వర్షానికే హైదరాబాద్ అస్తవ్యస్తం.. హైడ్రాపై సీఎం వ్యాఖ్యలు ఇప్పుడు ట్రోల్!

20 నిమిషాల వర్షానికే హైదరాబాద్ అస్తవ్యస్తం.. హైడ్రాపై సీఎం వ్యాఖ్యలు ఇప్పుడు ట్రోల్! నిన్న కురిసిన కేవలం 20 నిమిషాల వర్షపాతం హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేసింది. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, రాయదుర్గం మెట్రో స్టేషన్, ట్యాంక్‌బండ్, యూసఫ్‌గూడ వంటి ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ స్తంభించిపోగా, వాహనాలు నీటిలో చిక్కుకుపోయాయి. కొన్నిచోట్ల చెట్లు విరిగి వాహనాలపై పడగా, మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్ షాక్‌ల కారణంగా ప్రాణనష్టం…

Read Full News

నవయుగ ఇంజనీరింగ్‌పై అక్రమ నిర్మాణ ఆరోపణలు.. కలెక్టర్ రిపోర్ట్ ఉన్నా కదలని అధికారులు

నగరంలో ప్రముఖ నిర్మాణ సంస్థ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీపై అక్రమ నిర్మాణ ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మేడ్చల్–మల్కాజగిరి జిల్లా పరిధిలోని బేగంపేట ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి స్పష్టమైన నివేదికలు వచ్చినప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం ప్రకారం, సర్వే నంబర్లు 103 మరియు 103/2లో నిర్మాణానికి అనుమతి పొందిన నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ, వాస్తవానికి సర్వే నంబర్ 182లో…

Read Full News

బస్ స్టాండ్ల దుస్థితిపై ఆగ్రహం: రూ.700 కోట్లతో మార్పు సాధ్యమేనా?

రాష్ట్రంలోని బస్ స్టాండ్ల పరిస్థితిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతున్న ప్రభుత్వాలు, ప్రజలు రోజూ ఉపయోగించే బస్ స్టాండ్ల నిర్వహణలో మాత్రం నిర్లక్ష్యం చూపుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 140కి పైగా బస్ స్టాండ్లను అభివృద్ధి చేయడానికి ఒక్కోటి ₹5 కోట్లు కేటాయించినా, మొత్తం ఖర్చు దాదాపు ₹700 కోట్లకు పరిమితమవుతుంది. వేల కోట్ల ప్రాజెక్టులతో పోలిస్తే ఇది పెద్ద మొత్తం కాదని, అయినా సరైన ప్రణాళిక…

Read Full News

మూసి సుందరీకరణ, గాంధీ విగ్రహం వివాదం… ప్రజల ఇళ్ల కూల్చివేతలపై ఆకుల శ్రీవాణి ఆగ్రహం

నమస్తే… ఓకే టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం.మధుర్ పార్క్ అపార్ట్మెంట్స్ ప్రాంతంలో ప్రజల సమస్యలపై మాట్లాడేందుకు ఆకుల శ్రీవాణి ఈరోజు అక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా మూసి సుందరీకరణ, గాంధీ విగ్రహం నిర్మాణం, బఫర్ జోన్ పేరుతో ఇళ్ల కూల్చివేతలపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం భారీ వ్యయంతో మహాత్మా గాంధీ విగ్రహ నిర్మాణం చేపట్టాలని ప్రకటించిందని, అయితే సాధారణ ప్రజల ఇళ్లను కూల్చి విగ్రహాలు నిర్మించడం గాంధీ సిద్ధాంతాలకు విరుద్ధమని ఆమె వ్యాఖ్యానించారు. నిజంగా గాంధీపై…

Read Full News

నామినేషన్‌కు హౌస్ టాక్స్ ఎన్ఓసి తప్పనిసరా? స్పష్టమైన నియమాలు చూపాలంటూ అభ్యర్థుల ప్రశ్న

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియపై తీవ్ర గందరగోళం నెలకొంది. నామినేషన్ వేయాలంటే తప్పనిసరిగా హౌస్ టాక్స్ ఎన్ఓసి తీసుకురావాలనే నిబంధన ఎక్కడ ఉందో స్పష్టంగా చూపాలని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన ఫారం, చెక్‌లిస్ట్‌లో ఎక్కడా హౌస్ టాక్స్ చెల్లించాలి లేదా ఎన్ఓసి తీసుకురావాలనే నిబంధన లేదని అభ్యర్థులు అంటున్నారు. అలాంటప్పుడు తమను ఎందుకు చెల్లింపులు చేయమంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాదకుల విషయంలో కూడా ఒక్కరు సరిపోతారని బుక్‌లో ఉన్నప్పుడు ఇద్దరు ప్రతిపాదకులు కావాలంటూ…

Read Full News

జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌పై హోరాహోరీ: “హైదరాబాద్‌కు అన్యాయం” అంటూ బీజేపీ నిరసనలు

జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌పై వివాదం: “ఇది అభివృద్ధి కాదు, హైదరాబాద్‌కు అన్యాయం” – బీజేపీ కార్పొరేటర్ల ఆందోళన హైదరాబాద్ నగరంలో ప్రతిపాదిత జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. దాదాపు 300 డివిజన్లుగా విభజన చేసే యోచనపై కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుండటాన్ని బీజేపీ కార్పొరేటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ డీలిమిటేషన్ వెనుక అభివృద్ధి లక్ష్యం కంటే, ఎంఐఎం కి అనుకూలంగా రాజకీయ లెక్కలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నది ఒక్కటే—“మేము…

Read Full News

షేక్‌పేట్‌లో జీవన యాతన: “మా నీళ్లలో పిల్లలు పెరుగుతున్నారు… కానీ నాయకులు కనిపించరు

జూబిలీ హిల్స్ అసెంబ్లీ పరిధిలోని షేక్‌పేట్ ప్రాంతం — వర్షాలు పడితే నీళ్లు నిలిచి, దోమలు, పురుగులు కాటుకు చిన్న పిల్లలూ కూడా భయంతో గడిపే పరిస్థితులు. ఇళ్లలో నీరు, బయట గుంతలు… ఇదే ఈ ప్రాంతం యొక్క నిత్యచిత్రం. అధికారాలు మారినా, సమస్య మాత్రం అలాగే కొనసాగుతోందని ప్రజలు చెబుతున్నారు. స్థానికులు తమ బాధను ఇలా వ్యక్తం చేశారు: “వర్షం వస్తే ఇళ్లలో నీళ్లు… నీటిలోనే వండి తింటాం. పిల్లలు కూడా అదే నీటిలో ఉంటారు.”…

Read Full News

జూబిలీహిల్స్ షేక్‌పేట్ ప్రజల ఆగ్రహం: “10 ఏళ్లుగా సమస్యలు… ఎవరూ పట్టించుకోలేదు”

జూబిలీ హిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట్ డివిజన్‌లో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా వరదలు, డ్రైనేజ్ సమస్యలు, దోమల ఉక్కిరిబిక్కిరి పరిస్థితి కొనసాగుతున్నా, ఏ ప్రభుత్వం తమను పట్టించుకోలేదని స్థానికులు మండిపడ్డారు. వర్షాలు వస్తే ఇళ్లలోకి నీళ్లు చేరి బియ్యం, పప్పులు, గృహసరుకులు పాడైపోతున్నాయని, అయినా అధికారులు స్పందించడం లేదని వేదన వ్యక్తం చేశారు. “పది సంవత్సరాలు టీఆర్ఎస్, ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ — ఎవ్వరూ మా గల్లీ లోకి రాలేదు” అంటూ ప్రజలు ఆగ్రహంగా…

Read Full News

తెలంగాణలో వరదలు–పెద్దమనసు మాటలు vs ప్రభుత్వ నిర్లక్ష్యం: ప్రజల కేకలు ఎవరికి వినిపించాయి?

తెలంగాణలో వర్షాలు పడితే ప్రజల పరిస్థితి ఏమవుతోంది? ప్రభుత్వ బాధ్యత ఎక్కడ కనిపిస్తోంది? ఖమ్మం, మధిర, సూర్యాపేట, కొనిజర్ల మండలం, నెమ్మవాగు వంటి ప్రాంతాల్లో వరదలు తీవ్రమవుతుండగా, సాధారణ ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. కానీ ప్రభుత్వం చర్యలు మాత్రం గాలిలో కలిసిపోతున్నాయి. కొనిజర్ల మండలంలో నెమ్మవాగు వర్షంతో పొంగిపొర్లి ఓ డిసి‌ఎం డ్రైవర్ వరదలో కొట్టుకుపోయాడు. అక్కడ పోలీస్‌లు బారికేడ్‌లు పెట్టి ప్రజలకు హెచ్చరికలు ఇవ్వాల్సిన సమయంలో, ఎక్కడా వైద్య-పోలీస్-రెవెన్యూ యంత్రాంగం కనపడలేదు. స్థానిక ప్రజలే…

Read Full News

ఒకే ఇంటిపై 26 ఓట్లు: వెంగనూర్ కాలనీలో ఓటర్ జాబితాపై సందేహాలు

తెలంగాణ ఎన్నికల దశలో ఓటర్ జాబితా సక్రమతపై మళ్లీ చర్చ మొదలైంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగనూర్ కాలనీలో జరిగిన ఓ సంఘటన స్థానికుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 80 గజాల చిన్న ఇల్లు, గృహనెంబర్ 101, బూత్ నెంబర్ 125లో ఉన్న ఓ ఇంటి మీదే 26 ఓట్లు నమోదైనట్టు సమాచారం. ఆ ఇంటి యజమాని నారాయణ గారు క్యాటరింగ్ వ్యాపారం చేస్తున్నారు. ఆయన మాటల ప్రకారం తనకు ఇంట్లో ప్రస్తుతం ముగ్గురు మాత్రమే నివసిస్తున్నారని, మిగతా ఓటర్లు…

Read Full News