కేసీఆర్ అప్పుల్లో అభివృద్ధి కనిపించింది… కాంగ్రెస్ అప్పుల్లో ఏముంది?

రెండేళ్లలో రెండున్నర లక్షల కోట్ల అప్పు: తెలంగాణలో ఏం కనిపించింది? తెలంగాణలో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది.ఎవరైనా ప్రశ్న అడిగితే — అరెస్టులు.విమర్శ చేస్తే — కేసులు.నిజాలు మాట్లాడితే — యూట్యూబ్ ఛానెల్స్ టార్గెట్.ఇదేనా ప్రజాస్వామ్యం? లేక భయపెట్టే పాలనా విధానమా? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం నేరమైతే, రేపు ప్రశ్నించే గొంతులన్నీ మౌనంగా మారిపోతాయి. కానీ ప్రశ్నలు ఆగవు — ఎందుకంటే ప్రజలకు సమాధానాలు కావాలి. అప్పుల లెక్కలు – నిజం ఏంటి? తెలంగాణ ఏర్పడిన…

Read Full News

రెవెన్యూ పేరుతో యూనివర్సిటీలను రియల్ ఎస్టేట్ హబ్‌లుగా మార్చే ప్రయత్నం: మౌలానా ఆజాద్ యూనివర్సిటీ విద్యార్థుల ఆగ్రహం

తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ జనరేషన్ పేరుతో విద్యాసంస్థల భూములపై కన్నేయడం తక్షణమే ఆపాలని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులు, పరిశోధకులు డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే క్యాంపస్ బయట చేయాలని, యూనివర్సిటీ భూములను తాకొద్దని ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు. ఇది కేవలం రొటీన్ సర్వే అంటూ టూరిజం మంత్రి చేసిన వ్యాఖ్యలను విద్యార్థులు ఖండించారు. ఇదే తరహా ప్యాటర్న్‌ను గతంలో బిజినెస్ స్కూల్స్, సెంట్రల్ యూనివర్సిటీల విషయంలో కూడా…

Read Full News

రెండేళ్ల పాలనపై ప్రజల ప్రశ్నలు: సహకార ఎన్నికలకు ఎందుకు భయం? కేసుల లీక్‌లతో కాలక్షేపం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన విజయోత్సవాలు ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగించలేకపోయాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి కాలికి బల్బం కట్టుకొని జిల్లాల వారీగా తిరిగినా, స్థానికంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రజలను బెదిరించే ధోరణి కనిపించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 🏠 పథకాలు రాకపోతాయని బెదిరింపుల ఆరోపణలు ఇందిరమ్మ ఇండ్లు రావు, ఫలానా పథకం ఇవ్వం అంటూ అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను బెదిరించారని విమర్శలు…

Read Full News

42% బీసీ రిజర్వేషన్లపై నిశ్శబ్దం.. ఎన్నికల హడావుడి ఎందుకు? తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విమర్శలు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఇచ్చిన హామీలపై ఇప్పటివరకు స్పష్టమైన కార్యాచరణ లేకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటపై పార్లమెంట్లో కనీసం 20 నిమిషాల చర్చ కూడా జరగలేదని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ రెండూ అండగా ఉంటామని చెబుతున్నా, ప్రజల సమస్యలపై పార్లమెంట్లో చర్చ జరగకపోవడం అనుమానాలకు దారి తీస్తోంది. రాష్ట్రపతి తెలంగాణలో ఉన్న సమయంలోనైనా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకుని పెండింగ్‌లో ఉన్న బీసీ రిజర్వేషన్ అంశంపై చర్చించాల్సిందని…

Read Full News

హిల్ట్ పాలసీ లీక్ వెనుక మంత్రి హస్తం? సీఎం రేవంత్ చేతికి విజిలెన్స్ నివేదిక

హిల్ట్ పాలసీ లీక్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. పాలసీకి సంబంధించిన కీలక అంశాలు జీవో విడుదల కాకముందే బీఆర్ఎస్ నేతల చేతుల్లోకి చేరడంపై సీరియస్ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ అంశంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. సుమారు పది రోజుల పాటు సాగిన విచారణ అనంతరం విజిలెన్స్ అధికారులు తమ నివేదికను నేరుగా సీఎం చేతికి అందించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. విచారణలో ఓ మంత్రి, ఓ అధికారి ప్రమేయం ఉన్నట్టు…

Read Full News