బస్తీలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు.. హామీలకే పరిమితమైన ప్రజాపాలన! కార్పొరేటర్పై ప్రజల ఆగ్రహం
హైదరాబాద్: బస్తీల్లో మౌలిక వసతుల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు అధ్వానంగా ఉండటం, డ్రైనేజీలు పొంగిపొర్లడం, వర్షం వస్తే నీరు నిలిచిపోవడం, వాహనాలు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు సమస్యలు వివరించినా శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నూతన పైప్లైన్ కనెక్షన్ల కోసం రోడ్లను తవ్వి వదిలేయడంతో ఏడాదిన్నరగా రహదారులు దెబ్బతిన్నాయని స్థానికులు చెబుతున్నారు. రోడ్లపై గుంతలు,…

