కార్పొరేషన్ చైర్మన్ల పనితీరుపై సీఎం రేవంత్ సమీక్ష.. సగం మందికి పదవులు గల్లంతయ్యేనా?

తెలంగాణ ప్రభుత్వంలో రెండేళ్ల క్రితం నియమితులైన పలువురు కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చైర్మన్ల పదవీకాలాన్ని మరోసారి పొడిగించాలా లేదా అనే అంశంపై ప్రభుత్వం సమీక్ష చేపట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పనితీరు సరిగా లేకపోవడం, అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, 2024లో వివిధ కార్పొరేషన్లకు నియమితులైన చైర్మన్లలో గణనీయమైన సంఖ్యలో ఉన్నవారి పదవీకాలాన్ని…

Read Full News

ప్రభుత్వ దవాఖానల్లో రూ.100 కోట్ల మెడికల్ కిట్ల స్కామ్? పేదల ప్రాణాలతో చెలగాటమా?

సాధారణంగా ప్రభుత్వ దవాఖాన అంటే పేదవాడికి చివరి ఆశ. జేబులో రూపాయి లేకపోయినా ప్రాణాలు కాపాడే చోటుగా ప్రభుత్వ ఆస్పత్రులను ప్రజలు నమ్ముతారు. కానీ అదే పేదవాడి నమ్మకాన్ని కొందరు అవినీతి రాబందులు సొమ్ము చేసుకుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తెలంగాణలో వెలుగులోకి వస్తున్న తాజా పరిణామాలు చెబుతున్నాయి. తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGMSIDC)లో ఏకంగా రూ.100 కోట్ల విలువైన మెడికల్ కిట్లు, మందుల టెండర్లలో అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్…

Read Full News

రూ.7 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ.. పోలీసు వ్యవస్థపై మళ్లీ ప్రశ్నలు

నిజామాబాద్ జిల్లా బోధన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్ఐ చిత్తనోజు భాస్కర్ చారి రూ.7 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన తెలంగాణలో మరోసారి పోలీసు వ్యవస్థపై చర్చకు దారి తీసింది. తన సోదరుడి కుమారుడి పేరును క్రిమినల్ కేసులో చేర్చకుండా ఉండేందుకు ఫిర్యాదుదారుని నుంచి రూ.7 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. ఈ ఘటన…

Read Full News

వికారాబాద్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో లంచం ఆరోపణలు… కేసు పేరిట డబ్బుల డిమాండ్

వికారాబాద్ జిల్లాలోని ఉమెన్ పోలీస్ స్టేషన్‌పై లంచం ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఒక 498ఏ కేసు పేరుతో డబ్బులు డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపించాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తాండూర్‌కు చెందిన మున్సిపల్ కౌన్సిలర్ ఇర్షాద్ తనపై నమోదైన గృహ హింస కేసు నేపథ్యంలో పోలీస్ స్టేషన్‌కు పిలిచారని తెలిపారు. తన భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కౌన్సిలింగ్ చేయకుండా నేరుగా కేసు నమోదు చేశారని ఆరోపించారు. అదే కేసులో తనతో పాటు…

Read Full News

రాజకీయాల్లో రిటైర్మెంట్ కావాలి: యువతకు అవకాశం ఇవ్వాలని తీవ్ర డిమాండ్

తెలంగాణ రాజకీయాల్లో కొత్త తరం నాయకత్వం అవసరం ఉందని ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, ఉద్యోగాల్లో రిటైర్మెంట్ ఉన్నప్పటికీ, రాజకీయ నేతలకు రిటైర్మెంట్‌ వ్యవస్థ లేకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వృద్ధ నేతలు ఫీల్డ్‌లో తిరగలేని స్థితిలో ఉన్నప్పటికీ, పదవులు మాత్రం కావాలని, జీతాలు, సౌకర్యాలు, ప్రోటోకాల్‌లను ఆస్వాదిస్తూ కూర్చోవడం ప్రజాస్వామ్యానికి నష్టం అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. “రాజకీయాల్లో కూడా వయస్సు పరిమితి ఉండాలి. పార్లమెంట్‌లో బిల్లు పెట్టే ధైర్యం ఉంటే పెట్టండి”…

Read Full News

లియో మెరిడియన్ భూములపై బిగ్ బ్రదర్స్ కన్ను: 1000 కోట్ల బిగ్ దందా?

భూముల పేరుతో జరుగుతున్న భారీ దందాలు తెలంగాణలో కొత్తేమీ కాదు. అయితే లియో మెరిడియన్ రిసార్ట్ భూములపై జరుగుతున్న తాజా వ్యవహారం మరింత అనుమానాలకు తావిస్తోంది. కేవలం వదంతి కాదు — 1000 కోట్ల భారీ భూ దందా వెనుక రాజకీయ సీనియర్ బ్రదర్స్, పెద్ద మనుషుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు ప్రజల్లో ఆగ్రహం పెంచుతున్నాయి.. 🏗️ 2001 నుంచి ప్రారంభమైన కథ… ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు బినామీ కంపెనీల పేరుతో లియో మెరిడియన్ భూములను మళ్లీ…

Read Full News

జగ్గసాగర్‌లో సర్పంచ్‌పై భారీ అవినీతి ఆరోపణలు: గ్రామస్థుల బహిష్కరణపై ఉద్రిక్తత

జగిత్యాల జిల్లా మెటపల్లి మండలంలోని జగ్గసాగర్ గ్రామంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ పేరు మీద పెద్ద సంచలనం రేగింది. గ్రామ సర్పంచ్‌పై 28.6 లక్షల రూపాయల అవినీతి ఆరోపణలు వస్తుండగా, గ్రామస్థులు ఆగ్రహంతో ఎంపీడీఓ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. గ్రామస్థుల ఆరోపణల ప్రకారం, పంచాయతీ నిధులు, గ్రామ వేలంపాటలు, అభివృద్ధి పనుల్లో భారీ అవకతవకలు జరిగి, విచారించకుండా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. తాజాగా జగ్గసాగర్‌లో నిర్వహించిన వేలంపాటను వీడీసీ సభ్యులు అడ్డుకోవడంతో, గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అంతటితో…

Read Full News

12 ఏళ్లు ఒకే కుర్చీలో: దివ్యాంగుల సంక్షేమ శాఖలో అవినీతి ఆరోపణలు, శైలజ పాత్రపై సందేహాలు

దివ్యాంగుల సంక్షేమ శాఖలో నడుస్తున్న వ్యవస్థపై తీవ్ర అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. శాఖ డైరెక్టర్ శైలజ 12 సంవత్సరాలుగా అదే పదవిలో కొనసాగుతున్నారన్న విషయం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. సాధారణంగా ప్రభుత్వ వ్యవస్థలో అధికారులు రెండు నుంచి మూడు సంవత్సరాలకు ఒకసారి బదిలీ చేయడం సహజం. కానీ శైలజ మాత్రం ఒకే పదవిలో దాదాపు దశాబ్దానికి పైగా కొనసాగడం అనేక ప్రశ్నలకు దారి తీస్తోంది. 🔹 BRS కాలంలో మొదలైన అధికార పెత్తనం కొనసాగుతోందా? BRS కాలంలో…

Read Full News

డూప్లికేట్ ఉద్యోగుల మాఫియా బయటపడింది – ప్రతి నెల 25 కోట్ల జీతాల దోపిడీ

నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.డిసిసి అధ్యక్షుడిగా నియమితుడైన కైలాస్ నేత వెనుక ఉన్న బలగం ఎవరు?అతనికి ఆ పదవి ఎవరు ఇప్పించారు? అనే అంశంపై మంత్రి కోమట రెడ్డి వెంకట రెడ్డి ఆరా తీస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. కైలాష్ నేత గతంలో తనను వ్యక్తిగతంగా దూషించిన విషయం మరచిపోలేకపోతున్నారని కోమటరెడ్డి వర్గాలు చెబుతున్నాయి.అలాంటి వ్యక్తికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని కోమటరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంపై కోమటరెడ్డి నేరుగా…

Read Full News

ప్రజలు ఎందుకు బయటికి రారు? భయమా? నమ్మకం కోల్పోవడమా? — వ్యవస్థపై మాలత గారి మోస్తరు మంట”

తెలంగాణలో రాజకీయాలు మారినా, ప్రజల జీవితాల్లో మార్పు కనిపించకపోవడం బాధకరమని మాలత గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రజలు ఎందుకు బయటికి రావడం లేదు?” అనే ప్రశ్నను ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా, అది ఈ రాష్ట్ర రాజకీయ వ్యవస్థకు అద్దం పడే వాస్తవికత అని ఆమె స్పష్టంగా పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ:

Read Full News