ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్పై సీఐడీ దూకుడు.. 11 మంది అరెస్ట్, 108 యాప్స్ బ్లాక్!
ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్పై సీఐడీ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి దేశవ్యాప్తంగా భారీ చర్యలు ప్రారంభించింది. ఢిల్లీ, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో మ్యూల్ అకౌంట్ల ఆపరేటర్లను లక్ష్యంగా చేసుకుని రెండు వారాల పాటు నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్లో కీలక పురోగతి సాధించింది. సీఐడీ వెల్లడించిన వివరాల ప్రకారం, డఫాబెట్ వంటి బెట్టింగ్ యాప్స్కు సంబంధించి దేశవ్యాప్తంగా 225 ఫిర్యాదులు అందగా, ఇప్పటికే 73 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల దర్యాప్తులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్కు చెందిన సైబర్ నేరగాడితో…

