కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరింత ముదురుతున్నాయా? రాజగోపాల్ రెడ్డి, కొండా సురేఖ అసంతృప్తిపై రాజకీయ చర్చ

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తి పెరుగుతోందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు నియామకాల నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాత్రపై వస్తున్న చర్చలు ఈ అంశాన్ని మరింత హాట్ టాపిక్‌గా మార్చాయి. యాదాద్రి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామక ప్రక్రియలో స్థానిక ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి సమాచారం ఇవ్వలేదని…

Read Full News

యాదగిరిగుట్ట దేవస్థానం పాలకమండలి ఏర్పాటు.. చైర్మన్‌గా ఎంఎస్‌ఎన్ ఫార్మా అధినేత ఎం. సత్యనారాయణ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పాలకమండలిని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 18 మంది సభ్యులతో కూడిన ఈ పాలకమండలికి ఎంఎస్‌ఎన్ ఫార్మా అధినేత ఎం. సత్యనారాయణ రెడ్డిని చైర్మన్‌గా నియమించింది. ఈ పాలకమండలి పదవీకాలం రెండేళ్లు ఉంటుంది. ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం, పాలకమండలిలో మొత్తం 18 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 11 మంది వివిధ రంగాలకు చెందిన సభ్యులు కాగా, మరో ఏడుగురు ప్రభుత్వ అధికారులు…

Read Full News

మాకు విజయ్ లాంటి సీఎం కావాలి’.. తమిళనాడు పాలనతో తెలంగాణ ప్రభుత్వాన్ని పోలుస్తూ విమర్శలు

తెలంగాణ రాజకీయాల్లో తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పాలనపై చర్చ జోరందుకుంది. విద్య, దేవాదాయ శాఖ నిధులు, ప్రజా సంక్షేమం, పేద మరియు మధ్యతరగతి కుటుంబాల సమస్యల పరిష్కారంలో విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలను కొందరు ప్రశంసిస్తూ, తెలంగాణ ప్రభుత్వ పనితీరుతో పోలుస్తున్నారు. ప్రత్యేకంగా దేవాదాయ శాఖకు సంబంధించిన నిధులు ఆయా దేవాలయాల అభివృద్ధికే వినియోగించాలనే అంశంపై తమిళనాడులో తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో చర్చకు దారితీశాయి. దేవాలయాల ఆదాయాన్ని ఇతర అవసరాలకు మళ్లించకుండా ఆలయాల అభివృద్ధికే ఖర్చు చేయాలనే…

Read Full News

యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో వివాదం… ప్రధాన అర్చకుడిపై చర్యలేవి?

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారం ప్రస్తుతం భక్తుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన అర్చకుడిగా వ్యవహరిస్తున్న వెంకటాచార్యులు సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా “పురుడు” (జాత శౌచం) ఉన్న సమయంలోనే ఆలయ కార్యక్రమాల్లో పాల్గొనడం పెద్ద అపచారంగా భావిస్తున్నారు. హిందూ ఆచారాల ప్రకారం, ఇలాంటి సమయంలో పూజలు, ఆలయ సేవలు చేయడం నిషిద్ధంగా భావిస్తారు….

Read Full News

దేవాదాయ శాఖలో అవినీతి ఆరోపణలు… అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై మంత్రి కొండా సురేఖను నిలదీసిన ప్రజా ప్రతినిధి

రాష్ట్ర దేవాదాయ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపులు, నియామకాలపై అవినీతి ఆరోపణలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొండా సురేఖ పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి వ్యక్తిగత కార్యక్రమాలకు దేవాదాయ శాఖకు చెందిన పురోహితులు హాజరవుతున్నప్పటికీ, ఇతర ప్రైవేట్ కార్యక్రమాలకు వెళ్లొద్దని నిబంధనలు విధించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. ఇటీవల దేవాదాయ శాఖలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను అకారణంగా తొలగించి, వారి స్థానాల్లో అర్హతలేని వ్యక్తులను నియమిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి….

Read Full News

మున్సిపల్ ఎన్నికల వేళ పురోహితుడిపై దాడి ఆరోపణలు: ఎక్స్‌ సర్పంచ్ కుటుంబంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసి పోలింగ్ ముగిసే వరకు అందుబాటులో ఉండాలని స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయడంతో మున్సిపల్ ఎన్నికల నగారా మోగినట్టైంది. అయితే, గత సర్పంచ్ ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా హింస, బెదిరింపులు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు తీవ్ర ఆందోళనకు దారి తీస్తున్నాయి. ఇటీవల బాసర ప్రాంతానికి చెందిన ఓ పురోహితుడిపై దాడి జరిగిందని, తన కుటుంబం తీవ్ర భయాందోళనలో ఉందని బాధితుడు…

Read Full News

ఫైనాన్స్ శాఖలో విక్రమార్క వైఫల్యం? జీతాలు నిలిచిపోవడంతో రేవంత్ ఆగ్రహం

ఫైనాన్స్ శాఖపై సీఎం రేవంత్ ఆగ్రహం: అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు ఎక్కడ నిలిచిపోయాయి? తెలంగాణలో ఆర్థిక శాఖ పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆరు–ఏడు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఇంటెలిజెన్స్, ఉద్యోగ సంఘాలు నివేదించడంతో సీఎం ఆర్థిక శాఖపై చురుకులు పెట్టినట్టు సమాచారం. గతంలో గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని ఇచ్చిన ఆదేశాలను కూడా అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలతో…

Read Full News

తెలంగాణలో పెరుగుతున్న కష్టాలు: ప్రజలు గోషపడుతుంటే, నేతలు కోతలు — అవినీతి, అవ్యవస్థపై ఘాటు విమర్శలు

తెలంగాణలో ప్రతి తరగతి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. శ్రమజీవులు, కార్మికులు, మేస్త్రీలు, ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రిషియన్లు, ఆటో–క్యాబ్ డ్రైవర్లు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు— ఎవరి బతుకులోనూ స్థిరత్వం కనిపించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూలీలకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమయానికి వేతనాలు రాకపోవడం పెద్ద భారంగా మారింది. వ్యవసాయ రంగం పూర్తిగా నష్టాల్లో మునిగిపోగా, వరి–పత్తి కొనుగోలు సమస్యతో రైతులు తీవ్ర గోషలో ఉన్నారు. వరి తడిసిందని కొనకుండా, పత్తి కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు…

Read Full News