రైతులను గాలికొదిలేసిన ప్రభుత్వం.. ధాన్యం కొనుగోళ్లపై తీవ్ర ఆగ్రహం

రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతోందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. యూరియా సరఫరా నుంచి ధాన్యం కొనుగోళ్ల వరకు ప్రతి విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతు బంధు నిధుల విడుదలలో ఆలస్యం, విద్యుత్ సరఫరాలో సమస్యలు, ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని రైతులు చెబుతున్నారు. మిల్లర్లు అదనపు తరుగు పేరుతో రైతులను…

Read More

లారీలు పంపించండి.. పంట మొత్తం తడిసిపోతోంది” మార్కెట్ యార్డుల్లో రైతుల ఆవేదన

తెలంగాణలో రైతుల సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. పంటలను మార్కెట్ యార్డులకు తీసుకొచ్చి రెండు నెలలు గడిచినా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వర్షాలు ప్రారంభం కావడంతో మార్కెట్ యార్డుల్లో నిల్వ ఉంచిన ధాన్యం, జొన్నలు, ఇతర పంటలు తడిసి నష్టపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “జొన్నలు తీసుకొచ్చి రెండు నెలలు అవుతోంది. ఇప్పటికీ ఒక్క లారీ కూడా రాలేదు. పంట మొత్తం తడిసి పోతోంది” అంటూ రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు….

Read More

రైతుని రాజు చేస్తామన్నారు.. రోడ్డుపై కూర్చోబెట్టారు” – వరి కొనుగోళ్లపై రైతుల ఆవేదన

తెలంగాణలో వరి కొనుగోళ్ల వ్యవహారం మరోసారి రైతుల ఆగ్రహానికి కారణమైంది. కొనుగోలు కేంద్రాల్లో బస్తాల కొరత, కాంటాలు లేకపోవడం, ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడం, వర్షాలకు వరి తడవడం వంటి సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. “రైతుని రాజు చేస్తామన్నారు.. కానీ రోడ్డుపై కూర్చోబెట్టారు” అంటూ ప్రభుత్వంపై రైతులు మండిపడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి వరి పోసి కాపలా కాస్తున్నామని రైతులు చెబుతున్నారు. “నెల ఏడో తారీఖు నుంచి ఇక్కడే ఉన్నాం. ఇప్పటికీ కొనేవాళ్లు…

Read More