మంత్రి పదవిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ గురి?.. కాంగ్రెస్‌లో విస్తరణ ఊహాగానాలు

తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ Gaddam Prasad Kumar ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత Rahul Gandhiను కలవడం ఆసక్తికరంగా మారింది. దీంతో త్వరలో జరగనున్న క్యాబినెట్ విస్తరణలో గడ్డం ప్రసాద్‌కు మంత్రి పదవి దక్కే అవకాశాలపై ఊహాగానాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గడ్డం ప్రసాద్ మంత్రి పదవిని ఆశించినప్పటికీ, సామాజిక సమీకరణాల కారణంగా ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు….

Read More

గాంధీ భవన్‌లో తోపులాటపై ఫిరోజ్ ఖాన్ క్లారిటీ.. “చిన్న మిస్ అండర్‌స్టాండింగ్ మాత్రమే”

గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన తోపులాట రాజకీయంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ ఈ ఘటనపై స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ ఇది కేవలం చిన్న మిస్ అండర్‌స్టాండింగ్ మాత్రమేనని, పార్టీ లోపల ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. “పాతపేట ఎమ్మెల్యే గారు నన్ను స్టేజ్ మీదకు రమ్మన్నారు. నేను రాను అన్నాను. నేను ఆయనను నెట్టాను, ఆయన కూడా నన్ను నెట్టారు. వెనకాల కుర్చీ ఉండటంతో నేను పడిపోయాను. తర్వాత…

Read More

ఎన్టీఆర్ విగ్రహావిష్కరణపై రాజకీయ రగడ.. కాంగ్రెస్-టీడీపీ జెండాలతో అమీర్‌పేట్‌లో హాట్ టాపిక్!

ఇవాళ హైదరాబాద్ రాజకీయ వాతావరణం మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అమీర్‌పేట్ మైత్రివనం చౌరస్తాలో ఆయన కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనుండటంతో రాజకీయంగా పెద్ద చర్చ మొదలైంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని కాంగ్రెస్ నాయకత్వం చెబుతుండగా, తెలంగాణవాదుల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 23 అడుగుల ఎత్తుతో ప్రత్యేకంగా…

Read More

18 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. జూన్ లోపు అన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు 18 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు చైర్మన్, వైస్ చైర్మన్‌లను నియమిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా పార్టీ కోసం చాలా కాలంగా పనిచేస్తూ గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న నాయకులకు ఇది పెద్ద ఊరటనిచ్చే పరిణామంగా మారింది. ఈ నియామకాలలో 16 కుల సంఘాలు, చేతివృత్తిదారుల కార్పొరేషన్లు, ఫెడరేషన్లు ఉండగా, మిగిలిన రెండింటిలో తెలుగు అకాడమీ మరియు గ్రామ…

Read More

లిక్కర్ స్కామ్ ఆరోపణలున్న కవితకు కాంగ్రెస్‌లో చోటు లేదు: మధు యాష్కి గౌడ్ స్పష్టం

లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని టీపీసీసీ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ స్పష్టం చేశారు. బుధవారం గాంధీ భవన్‌లో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు ప్రాణత్యాగాలు చేసి ఉద్యమం చేస్తే, అదే సమయంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు — కేసీఆర్, హరీష్ రావు, కవిత — 2010లోనే అమెరికాలో కంపెనీలు పెట్టుకున్నారని మధు యాష్కి…

Read More