ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీకి చెక్‌ పెట్టాలి.. అసెంబ్లీలో విజయశాంతి ఫైర్‌!

హైదరాబాద్‌లో వైరల్‌ ఫీవర్‌ బాధితుల నుంచి ప్రైవేట్‌ ఆస్పత్రులు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయంటూ అసెంబ్లీలో ఆందోళన వ్యక్తమైంది. సాధారణ జ్వరానికి కూడా వేల రూపాయల పరీక్షలు, వైద్య ఖర్చులు విధిస్తున్నారని ఎమ్మెల్యే విజయశాంతి ప్రత్యేక ప్రస్తావన ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సాధారణంగా జ్వరం, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న ప్రజలు సమీపంలోని చిన్న ఆస్పత్రులు, వైద్యులను సంప్రదిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. జ్వరం తగ్గకపోతే పెద్ద ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోందని, అక్కడ రక్త పరీక్షలు,…

Read Full News

ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్ల హాజరుపై ఎమ్మెల్యేల అసంతృప్తి.. అటెండెన్స్‌పై నివేదిక కోరిన ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ

తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల హాజరు, వైద్య సేవల నాణ్యతపై ప్రజాప్రతినిధుల నుంచి వరుసగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రత్యేకంగా దృష్టి సారించారు. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు సమయానికి అందుబాటులో ఉండటం లేదని, రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు ఎమ్మెల్యేలు ప్రస్తావించినట్లు సమాచారం. సమీక్ష సమావేశాల్లో ప్రభుత్వ వైద్యుల హాజరు, ఆస్పత్రుల్లో మందుల కొరత, సిరంజీలు వంటి ప్రాథమిక వైద్య…

Read Full News