నిత్యావసర ధరల మంట.. సామాన్యుడి జేబు గుల్ల చేస్తున్న ఖర్చులు ఎవరి విధానం?

ఒక గ్యాస్ సిలిండర్ ధర రూ.1,100.. లీటర్ వంట నూనె రూ.195.. కిలో బియ్యం రూ.70.. పంచదార రూ.70.. ఈ ధరలు వింటుంటే సామాన్యుడికి గుండెల్లో మంట పుట్టదా? రోజంతా చెమటోడ్చి సంపాదించిన డబ్బు ఇంటి ఖర్చులకే సరిపోని పరిస్థితి వస్తే మధ్యతరగతి, పేద కుటుంబాలు ఎలా బతకాలి? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనిషి ఉపయోగించే ప్రతి వస్తువుపై ధరల ప్రభావం కనిపిస్తోంది. ఇది కేవలం కొన్ని వస్తువుల ధరల సమస్య…

Read Full News

కమర్షియల్ గ్యాస్ బండపై భారీ షాక్.. ఒక్కరోజులో ₹993 పెంపు.. చిన్న వ్యాపారులకు మోదీ గిఫ్టా?

దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ ధరల పెంపు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక్కరోజులోనే కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌పై ₹993 పెంపు జరగడం చిన్న వ్యాపారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే యుద్ధ ప్రభావం, సరఫరా సమస్యలు, బ్లాక్ మార్కెట్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వ్యాపారులకు ఇది మరింత భారంగా మారింది. ముఖ్యంగా టీ స్టాల్లు, టిఫిన్ సెంటర్లు, చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు నడిపే వారిపై ఈ నిర్ణయం నేరుగా ప్రభావం చూపనుంది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర…

Read Full News

గ్యాస్ బ్లాక్ మార్కెట్, నూనెల ధరల సెగ: యుద్ధ ప్రభావంతో సామాన్యుడికి డబుల్ షాక్

దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడి జీవితాన్ని కుదేలు చేస్తున్నాయి. ఒకవైపు వంట గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ దందా, మరోవైపు వంటనూనెల ధరల పెరుగుదల—ఈ రెండింటి ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతినడంతో సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు తగ్గాయి. దీంతో మార్కెట్‌లో వంటనూనెల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. లీటర్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ₹30 వరకు, పామ్ ఆయిల్‌పై ₹20 వరకు పెరుగుదల కనిపిస్తోంది….

Read Full News