అసెంబ్లీ సెషన్లకు కేసీఆర్ డుమ్మా? ఆరు రోజుల కీలక సమావేశాలపై పెరుగుతున్న ప్రశ్నలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. దాదాపు ఆరు రోజుల పాటు, జనవరి 7వ తేదీ వరకు కొనసాగనున్న ఈ సమావేశాలు రాజకీయంగా అత్యంత కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం—బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్నదే. ఇప్పటికే మొదటి రోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ కేవలం ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు సభలో ఉండి వెళ్లిపోయారు. ఆ రోజు పెద్దగా చర్చకు వచ్చే…

Read Full News

అసెంబ్లీలో అరుదైన దృశ్యం: కేసీఆర్‌ను ఆత్మీయంగా పలకరించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ శాసనసభలో సోమవారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విపక్ష నేత మరియు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్వయంగా వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందని అడిగి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉదయం 10:29 గంటలకు కేసీఆర్ శాసనసభలోకి ప్రవేశించగా, ఒక్క నిమిషం తరువాత సీఎం రేవంత్ రెడ్డి సభలోకి వచ్చారు. తన సీటు…

Read Full News

సభా సాంప్రదాయాలు దిగజారుతున్నాయి… భాషపై రాజకీయ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి: జాఫర్ హుసేన్

సభా సాంప్రదాయాలు, అధ్యక్ష గౌరవ మర్యాదలు, రాజకీయ భాషపై తెలంగాణ శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే శ్రీ జాఫర్ హుసేన్. రాజకీయ నాయకులందరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ విమర్శలు, సద్విమర్శలు చేయాలని, కానీ భాషను దిగజార్చే విధంగా మాట్లాడడం సరైంది కాదని ఆయన స్పష్టం చేశారు. సభా వేదికగా మాట్లాడుతూ జాఫర్ హుసేన్, “మనం అందరం రాజకీయ నాయకులమే. ఎవరైనా ఎదుటి వారిని గౌరవిస్తూ విమర్శలు చేయాలి. కానీ మాటల స్థాయిని దిగజార్చడం రాజకీయ లక్షణం కాదు,…

Read Full News

కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలే రెండేళ్ల కాంగ్రెస్ పాలన: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత తీవ్ర విమర్శలు

కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలే రెండేళ్ల కాంగ్రెస్ పాలన: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత తీవ్ర విమర్శలు బీఆర్ఎస్ పార్టీ నేత ఒక బహిరంగ సభలో, గత రెండు సంవత్సరాల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన చర్యలను తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలే ఈ కాలంలో ముఖ్యంగా జరిగాయని, పేద ప్రజలకు ప్రభుత్వంనుండి అందిన పనులు అత్యల్పమని ఆయన తెలిపారు. సభలో ఆయన చెప్పారు, “రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం ఏం సాధించింది అంటే కూల్చివేతలు,…

Read Full News

అవినీతి కేసుల్లో ఇద్దరు మంత్రులు జైలుకే: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

అవినీతి కేసుల్లో ఇద్దరు మంత్రులు జైలుకి వెళ్లడం ఖాయం: కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెంచుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు మంత్రులు అవినీతి కేసుల్లో తప్పకుండా జైలుకు వెళ్లనున్నారని ఆయన స్పష్టం చేశారు. చట్టంలోని లొసుగులను ఆశ్రయించుకొని ఆ ఇద్దరు మంత్రులు వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు….

Read Full News

ఫోన్ ట్యాపింగ్ కేసు క్లైమాక్స్‌కు చేరిందా? కేసీఆర్–హరీష్ రావులకు సిట్ నోటీసులు దాదాపు ఖాయం!

ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు చేరిందా? కేసీఆర్–హరీష్ రావులకు సిట్ నోటీసులు దాదాపు ఖాయం తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) దర్యాప్తు ఇప్పుడు తుది అంకానికి చేరిందన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు పేర్లు వాంగ్మూలాల్లో రావడంతో వారిని విచారణకు పిలిచే అంశం దాదాపు ఖరారైనట్టేనని…

Read Full News

ఫోన్ ట్యాపింగ్ కేసుపై హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు.. నోటీసులకు భయపడేది లేదంటూ సవాల్

ఫోన్ ట్యాపింగ్ కేసుపై రాజకీయ దుమారం మరింత ఉధృతమవుతోంది. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో స్పందించారు. మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ, “ఇలాంటి తాటాకు చప్పుళ్లకు మేము భయపడేది లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇస్తామంటూ లీకులు ఇచ్చి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నోటీసులు, కేసులు మాకు లెక్కే కాదు. రెట్టించిన ఉత్సాహంతో ప్రభుత్వాన్ని నిలదీస్తాం” అని స్పష్టం చేశారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి…

Read Full News

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు నోటీసులపై ఉత్కంఠ

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (Special Investigation Team) దర్యాప్తు వేగం పెంచింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ రావు ప్రభాకర్ రావును తాజాగా సిట్ అధికారులు విచారించారు. అయితే ఆయన విచారణకు పూర్తిగా సహకరించడం లేదని పేర్కొంటూ, మరింత కస్టడీ అవసరమని కోర్టును ఆశ్రయిస్తూ మరోసారి రిమాండ్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాకర్ రావు కస్టడీ గడువు మరో 48 గంటల్లో ముగియనున్న నేపథ్యంలో, ఇప్పటికే అరెస్టయిన…

Read Full News

కృష్ణ–గోదావరి జలాలపై సభలోనే చర్చకు సిద్ధం: కేసీఆర్‌కు ఓపెన్ ఛాలెంజ్, పాలమూరు–రంగారెడ్డిపై ప్రజా ఉద్యమానికి బిఆర్ఎస్ సంకేతం

2023 ఎన్నికలకు ముందు కేసీఆర్ పూర్తిగా రాజకీయాల్లో క్రియాశీలకంగానే ఉన్నారని, అయినా ప్రజల తీర్పుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బిఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. తాజాగా గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ గ్రామ పంచాయతీలను గెలుచుకోవడం ద్వారా కేసీఆర్ నాయకత్వాన్ని అక్కడి ప్రజలు తిరస్కరించారన్న వాదనను కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్న నేపథ్యంలో, దీనిపై బిఆర్ఎస్ ఘాటుగా స్పందించింది. గజ్వేల్ ప్రజలు కేసీఆర్ రాజకీయాల్లో లేరని కాదు, ఎమ్మెల్యేగా ఉన్నా ఉపయోగం లేదన్న భావనతో తీర్పు ఇచ్చారని…

Read Full News

రోడ్డు మీద కాదు.. అసెంబ్లీలో చర్చిద్దాం: కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌

తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రోడ్డు మీద విమర్శలు కాదు, అసెంబ్లీ వేదికగా చర్చకు రావాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో జరిగిన తేనేటి విందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం, కృష్ణా గోదావరి జలాల అంశంపై సభలో చర్చకు సిద్ధమా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. కృష్ణా…

Read Full News