కబడ్డీని రగ్బీని మించి ప్రపంచ క్రీడగా మార్చాలి.. ఒలింపిక్స్లో కెన్యా ఆటగాళ్లే నా కల: జేమ్స్ అకామా
హైదరాబాద్: కబడ్డీని ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యంలోకి తీసుకెళ్లి, రగ్బీ తరహాలో ప్రతి దేశంలోనూ ఆడే క్రీడగా తీర్చిదిద్దాలని కెన్యా కబడ్డీ ప్రతినిధి జేమ్స్ అకామా ఆకాంక్షించారు. హైదరాబాద్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ (IKF) సమావేశంలో పాల్గొన్న ఆయన.. కబడ్డీ భవిష్యత్తుపై తన అభిప్రాయాలను వెల్లడించారు. జేమ్స్ అకామా మాట్లాడుతూ.. భారత్కు రావడం తనకు ఇదే మొదటిసారి కాదని తెలిపారు. గతంలో 2012, 2013 సంవత్సరాల్లో ఉత్తర భారతదేశంలోని పంజాబ్లో జరిగిన వరల్డ్ కబడ్డీ ఛాంపియన్షిప్ కోసం…

