కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరింత ముదురుతున్నాయా? రాజగోపాల్ రెడ్డి, కొండా సురేఖ అసంతృప్తిపై రాజకీయ చర్చ

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తి పెరుగుతోందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు నియామకాల నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాత్రపై వస్తున్న చర్చలు ఈ అంశాన్ని మరింత హాట్ టాపిక్‌గా మార్చాయి. యాదాద్రి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామక ప్రక్రియలో స్థానిక ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి సమాచారం ఇవ్వలేదని…

Read Full News

కాంగ్రెస్ మంత్రివర్గ ప్రక్షాళనపై ఉత్కంఠ.. మంత్రి పదవుల రేసులో ఎవరు ముందున్నారు?

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ మంత్రివర్గ ప్రక్షాళన అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పులు, నామినేటెడ్ పదవుల పంపకం వంటి అంశాలపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. పార్టీలోని పలువురు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకోవడంతో ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు రాజకీయ లాబీయింగ్ వేగం పుంజుకున్నట్లు తెలుస్తోంది. ఎవరికి అవకాశం దక్కుతుంది?…

Read Full News

యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో వివాదం… ప్రధాన అర్చకుడిపై చర్యలేవి?

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారం ప్రస్తుతం భక్తుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన అర్చకుడిగా వ్యవహరిస్తున్న వెంకటాచార్యులు సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా “పురుడు” (జాత శౌచం) ఉన్న సమయంలోనే ఆలయ కార్యక్రమాల్లో పాల్గొనడం పెద్ద అపచారంగా భావిస్తున్నారు. హిందూ ఆచారాల ప్రకారం, ఇలాంటి సమయంలో పూజలు, ఆలయ సేవలు చేయడం నిషిద్ధంగా భావిస్తారు….

Read Full News

కొండా సురేఖ ఎందుకు ఒంటరిగా మిగిలారు? కాంగ్రెస్ లోపలి రాజకీయాల అసలు కథ

కొండా సురేఖ ఎందుకు ఒంటరిగా మిగిలారు? కాంగ్రెస్ లోపలి రాజకీయాల అసలు కథ కొండా సురేఖ…తెలంగాణ రాజకీయాల్లో ఒక బలమైన పేరు.దశాబ్దాలుగా రాజకీయాల్లో నిలబడ్డ మహిళ.కాంగ్రెస్ హయాంలో కీలక మంత్రి,తర్వాత కేసీఆర్ పాలనలోనూ తనదైన ముద్ర. అలాంటి కొండా సురేఖ గురించిఇప్పుడు ప్రజల్లో వినిపిస్తున్న మాటలుచిన్నవి కావు.సాధారణ విమర్శలు కావు. మంత్రి పదవికి సీఎం అవసరం లేదు” అన్న ధైర్యం కొండా సురేఖ గారి మాటల్లో ఒక ధైర్యం కనిపిస్తుంది. “మాకు ముఖ్యమంత్రి అవసరం లేదు,వరంగల్ ప్రజలు…

Read Full News

త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?: పొన్నం, కొండా సురేఖ తొలగింపు వార్తలపై మహేష్ గౌడ్ స్పష్టీకరణ

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందనే ప్రచారం నేపథ్యంలో, మంత్రి పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలను మంత్రివర్గం నుంచి తొలగిస్తారనే వార్తలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నేతలని ఆయన కితాబు ఇచ్చారు. అయితే శాఖల మార్పులు లేదా మంత్రివర్గంలో ఇతర మార్పులు ఉంటాయా అనే అంశంపై…

Read Full News

పరువునష్టం దావా విచారణలో కొండా సురేఖపై కోర్టు హెచ్చరిక — నాన్-బైలబుల్ వారెంట్ అవకాశం

పరువునష్టం దావా విచారణలో భాగంగా నాంపల్లి కోర్టు మంత్రి కొండా సురేఖకు కీలకమైన సూచనలు చేసింది. విచారణకు పలుమార్లు వ్యక్తిగతంగా హాజరు కాకపోవడంతో కోర్టు అసహనం వ్యక్తం చేస్తూ, అవసరమైతే నాన్-బైలబుల్ వారెంట్ జారీ చేసే అవకాశాన్ని కూడా సూచించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5కి వాయిదా వేసింది. కేటీఆర్ దాఖలు చేసిన పరువునష్టం దావా నేపథ్యంలో ఈ కేసు నడుస్తోంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తాను చేసిన వ్యాఖ్యలు తప్పు కాదని, ప్రచారంలో…

Read Full News

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: నవీన్ యాదవ్ క్యాంప్‌లో ఆంతర్రంగిక ఉద్రిక్తతలు, క్యాడర్ అసంతృప్తి, రాజకీయ వ్యూహాలపై ప్రశ్నలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చుట్టూ పలు రాజకీయ చర్చలు, విమర్శలు, క్యాడర్‌లో అసంతృప్తి వంటి అంశాలు బయటకు వస్తున్నాయి. సోషల్ మీడియా వేదికల్లో వచ్చిన వ్యాఖ్యలు, స్థానిక రాజకీయ కార్యకర్తల అభిప్రాయాలు, ప్రజా చర్చల ఆధారంగా కొన్ని ప్రధాన పరిశీలనలు వెలుగులోకి వచ్చాయి. కుటుంబంపై బైండ్-ఓవర్ చర్యల ప్రభావం ఎన్నికల నిబంధనల ప్రకారం పోలీస్ శాఖ కొంతమంది రౌడీషీటర్స్ పై బైండ్-ఓవర్ చర్యలు చేపట్టింది.ఈ క్రమంలో నవీన్…

Read Full News

ఆర్టీఐలతో భూ కేటాయింపుల దందా బహిర్గతం – రేవంత్ కేబినెట్‌లో అంతర్గత పావులు కదలిక?

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం లో కొత్త సంచలనం.తాజాగా వివిధ భూ కేటాయింపులు, టెండర్లు, కాంట్రాక్ట్ పనుల వివరాలు తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున ఆర్టీఐ (RTI) దరఖాస్తులు సమర్పించబడుతున్నాయి. వీటిలో కొన్ని మంత్రులే లేదా వారి అనుచరులే పెట్టినవని సమాచారం. ఆర్టీఐల ద్వారా ఎన్ని కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి, వారి టెక్నికల్ మరియు ఫైనాన్షియల్ బిడ్స్ వివరాలు, భూముల కేటాయింపుల జాబితా, ఇవన్నీ కూడా కోరుతున్నారని తెలుస్తోంది.దాంతో జిల్లా స్థాయి అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. కొందరు అధికారులు…

Read Full News

రేవంత్ ప్రభుత్వం కూలిపోనున్నదా? – కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి ప్రభావం, మంత్రుల ఓటమి భయాలు

తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మేఘాలు కమ్ముకుంటున్నాయి. కేవలం రెండు నెలలు పూర్తి అవుతుండగానే, అంతర్గత అసంతృప్తులు, హైకమాండ్ నిరాశ, మరియు రాజగోపాల్ రెడ్డి గారి ప్రభావం కలిసిపడి కాంగ్రెస్ పార్టీలో పెద్ద కలకలం రేపుతున్నాయి. సమాచారం ప్రకారం, 2026–27లో జరిగే తదుపరి ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న మంత్రులు చాలామంది ఓడిపోతారనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు వంటి నేతలు తమ సొంత…

Read Full News

క్యాబినెట్ బేటీలో రేవంత్ రెడ్డి హెచ్చరిక – “రోడ్డెక్కొద్దు, ప్రజల్లో చులకన కాకండి”

రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి చెలరేగింది. తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసినట్లు సమాచారం.“రోడ్డెక్కొద్దు, ప్రజల్లో చులకన కావద్దు, అనవసర విషయాలకు రాద్దాంతం వద్దు” అంటూ సీఎం కఠినంగా స్పందించినట్టు తెలుస్తోంది. జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో మంత్రుల మధ్య జరుగుతున్న విభేదాలు, పబ్లిక్ స్టేట్మెంట్లు, సోషల్ మీడియా వివాదాలపై సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేశారు. “ఇలాంటివన్నీ టీ కప్పులో తుఫాన్లు మాత్రమే. ప్రజల్లో గందరగోళం…

Read Full News