తెలంగాణలో 22A ల్యాండ్ వివాదం.. అసలు గేమ్ ఏంటి? ఆరోపణల వెనుక నిజమెంత?

తెలంగాణలో భూముల వ్యవహారం మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. 22A జాబితా పేరుతో ప్రైవేట్ భూములు ఇబ్బందులకు గురవుతున్నాయన్న ఆరోపణలు ఒకవైపు.. 22A నుంచి భూములను తొలగించే ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయన్న అనుమానాలు మరోవైపు.. ఫేక్ గవర్నమెంట్ మెమోలు, నకిలీ పత్రాలతో భూములపై మోసాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రభుత్వ వాదనలు ఇంకోవైపు ఉన్నాయి. అసలు 22A అంటే ఏమిటి? ఈ వివాదం వెనుక ఉన్న ప్రశ్నలు ఏంటి? ప్రజలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? 22A అంటే…

Read Full News

మీసేవ ఆపరేటర్లపై వేట… చలానా కుంభకోణం నేపథ్యంలో 632 మందికి షాక్

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో వెలుగులోకి వచ్చిన చలానా కుంభకోణం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. భూసంబంధిత సేవల్లో జరిగిన అవకతవకలపై విచారణ వేగవంతం చేస్తూ 632 మంది మీసేవ ఆపరేటర్లను విధుల నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకుంది. భూభారతి–ధరణి వ్యవస్థలో చలానాల అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు ఈ వ్యవహారంలో 37 కేసులు నమోదు కాగా, సంబంధిత వ్యక్తులపై చర్యలు కొనసాగుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయాల్లో అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న మీసేవ ఆపరేటర్లపై కఠిన…

Read Full News

జాయింట్ సబ్ రిజిస్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు: 100 కోట్ల అక్రమాస్తులు వెలుగులోకి

రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్టర్ మధుసూదన్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) అధికారులు శుక్రవారం విస్తృత సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్టు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో చేపట్టిన ఈ దాడుల్లో సుమారు ₹100 కోట్లకు పైగా అక్రమాస్తులు ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం. మధుసూదన్ రెడ్డి బంధువులు, స్నేహితులు, బినామీలకు సంబంధించిన ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఫార్మ్ హౌసులు, ఓపెన్ ఫ్లాట్లు,…

Read Full News