తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అడుగు – పవన్ కళ్యాణ్ ఆశయాలతో ముందుకు సాగుతున్న యువ నాయకులు

జనసేన పార్టీ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని మరింత విస్తరించేందుకు ముందుకు సాగుతోంది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల ప్రభావంతో అనేక మంది యువకులు రాజకీయాల్లోకి రావాలనే సంకల్పంతో జనసేనలో చేరుతున్నారని పార్టీ నాయకులు పేర్కొన్నారు. రాజమల్లయ్య మాట్లాడుతూ, తాను ఎన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ అభిమానినని, ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో చేసిన అభివృద్ధి తనను రాజకీయాల వైపు నడిపించిందని తెలిపారు. సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి రావాలనుకున్నానని, తన…

Read More

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల: కోడ్ అమల్లోకి, అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో మాత్రమే కోడ్ అమల్లో ఉంటుందని, మిగిలిన ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఉండదని క్లారిటీ ఇచ్చారు. కోడ్ అమల్లో ఉన్న ప్రాంతాల్లో కొత్త ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అధికారిక పర్యటనలు, సమీక్ష సమావేశాలు నిర్వహించేందుకు వీలు ఉండదని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, కనీసం 85…

Read More

కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తున్నాయి: 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే ఎన్నికలు – బీసీ జేఏసీ డిమాండ్

బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై ఎండగట్టేందుకే ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించామని బీసీ జేఏసీ నేతలు స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ – రెండు ప్రభుత్వాలు కూడా బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బీసీలకు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత 42 శాతం రిజర్వేషన్ల అమలును విస్మరిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు…

Read More

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోరే.. జనసేనతో పొత్తు లేదని స్పష్టం చేసిన రామచంద్రరావు

రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు స్పష్టంచేశారు. జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రశక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉపాధి పథకాలపై నిర్వహించిన సెమినార్‌లో మాట్లాడిన ఆయన ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తమ పార్టీ సత్తా ఏంటో తెలిసిపోయిందని రామచంద్రరావు వ్యాఖ్యానించారు. అయితే, వాస్తవ పరిస్థితి చూస్తే బీజేపీ…

Read More

మున్సిపల్ ఎన్నికల వేళ పురోహితుడిపై దాడి ఆరోపణలు: ఎక్స్‌ సర్పంచ్ కుటుంబంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసి పోలింగ్ ముగిసే వరకు అందుబాటులో ఉండాలని స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయడంతో మున్సిపల్ ఎన్నికల నగారా మోగినట్టైంది. అయితే, గత సర్పంచ్ ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా హింస, బెదిరింపులు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు తీవ్ర ఆందోళనకు దారి తీస్తున్నాయి. ఇటీవల బాసర ప్రాంతానికి చెందిన ఓ పురోహితుడిపై దాడి జరిగిందని, తన కుటుంబం తీవ్ర భయాందోళనలో ఉందని బాధితుడు…

Read More

టికెట్లు కార్యకర్తల హక్కు.. మున్సిపల్ ఎన్నికల్లో 50 సీట్లు లక్ష్యం: కాంగ్రెస్ నేత దూకుడు వ్యాఖ్యలు

మున్సిపల్ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని కాంగ్రెస్ నేత తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. టికెట్ల పంపిణీ అనేది ఎవరి వ్యక్తిగత సొత్తు కాదని, అది పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తల హక్కు అని స్పష్టం చేశారు. పార్టీని అంగట్ల సరుకులా భావిస్తే ఊరుకునేది లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కనీసం 50 స్థానాలను లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నామని…

Read More

66% గెలుపు వాగ్దానాలపై ముఖ్యమంత్రి మాటలు మార్చడం: బిఆర్ఎస్ సవాలు

తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ, ప్రెస్ మీట్‌లలో ఇచ్చిన మాటలపై తీవ్ర వాదవివాదాలు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి మొదట “మేము రాష్ట్రంలో 66% గెలిచాం, ప్రజలు మా ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇచ్చారు” అని ప్రకటించినా, ఐదు నిమిషాల్లోనే మాట మార్చారని విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పరిస్థితులు, కులం, ప్రాంతాన్ని బట్టి ఫలితాలు వస్తాయి, దీనికి ప్రభుత్వానికి సంబంధం లేనని చెప్పడం ప్రజాసమాజంలో అశాంతిని సృష్టించిందని విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయ నేతలు, ముఖ్యంగా బిఆర్ఎస్ వర్గాలు,…

Read More

సర్పంచ్ ఎన్నికల ఫలితాలే సంకేతం: ఎంపిటీసీ–జెడ్పిటీసీ ఎన్నికలకు కాంగ్రెస్ వెనకడుగు?

ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారుతున్నాయి. ముఖ్యంగా పార్టీ గుర్తు లేకుండా జరిగిన ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్‌కు వచ్చిన ఫలితాలు, రాబోయే ఎంపిటీసీ–జెడ్పిటీసీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సభల్లో మాట్లాడుతున్న బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తల మాటల్లో స్పష్టంగా కనిపిస్తున్నది ఒక్కటే—సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు యాదృచ్ఛికం కాదు. “కారు గుర్తు లేకపోయినా గుబ గుయ్యి అనిపించింది. రేపు కారు గుర్తుతో ఎన్నికలు…

Read More

పంచాయతీ ఎన్నికల ఫలితాలే 2029 అసెంబ్లీ ఎన్నికలకు నాంది: సీఎం రేవంత్ రెడ్డి

2029లో కూడా ఇదే రీతిలో ఫలితాలు పునరావృతం అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ విజయాన్ని అందించిన ప్రజలకు, అలాగే కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,702 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా, అందులో 7,527 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు, 808 పంచాయతీల్లో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థులు విజయం సాధించారని సీఎం వెల్లడించారు. రెబెల్స్‌తో కలిపి మొత్తం 8,335 పంచాయతీల్లో కాంగ్రెస్…

Read More

అసెంబ్లీ ఎన్నికలను మించిపోయిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఖర్చు – ఓటుకు రూ.55 వేలు, రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్ల చలామణి

తెలంగాణలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను కూడా తలదన్నేలా మారాయని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన గ్రామాల్లోనూ, జనరల్ గ్రామాలకు తీసిపోకుండా భారీగా ఖర్చు జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,728 గ్రామ పంచాయతీల్లో సుమారు 1,200 ఏకగ్రీవాలు ఉండగా, మిగిలిన దాదాపు 10 వేల పంచాయతీల్లో అన్ని పార్టీల అభ్యర్థులు కలిసి రూ.6 వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్లు అంచనాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే, గత…

Read More