కబడ్డీని ఒలింపిక్స్‌కు తీసుకెళ్లడమే మా కల.. యూరప్‌లో కోచ్‌లు, నిధుల కొరతే ప్రధాన సవాళ్లు: జర్మనీ ప్రతినిధి ఇంద్రజీత్ సింగ్ జోసన్

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కబడ్డీని విస్తరించి.. ఒలింపిక్స్‌ స్థాయికి తీసుకెళ్లడమే అన్ని కబడ్డీ ఫెడరేషన్ల ప్రధాన లక్ష్యమని జర్మనీకి చెందిన కబడ్డీ ప్రతినిధి ఇంద్రజీత్ సింగ్ జోసన్ తెలిపారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్‌ (IKF) సమావేశంలో పాల్గొన్న ఆయన.. కసాని జ్ఞానేశ్వర్‌ చొరవపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచ ఫెడరేషన్లను ఒకే వేదికపైకి తీసుకురావడం గొప్ప విషయం ప్రపంచంలోని మూడు కబడ్డీ ఫెడరేషన్ల ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకువచ్చినందుకు కసాని జ్ఞానేశ్వర్‌కు ఇంద్రజీత్ సింగ్ జోసన్ ధన్యవాదాలు…

Read Full News

తాంజానియాలో కబడ్డీకి కొత్త ఊపు.. స్కూళ్ల నుంచే యువ ప్రతిభను వెలికితీస్తాం: తాంజానియా కబడ్డీ ప్రతినిధులు

హైదరాబాద్: భారతదేశంలో జరుగుతున్న అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్‌ (IKF) సమావేశంలో పాల్గొన్న తాంజానియా కబడ్డీ ప్రతినిధులు.. తమ దేశంలో కబడ్డీని మరింత అభివృద్ధి చేసేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తామని తెలిపారు. హైదరాబాద్‌కు ఆహ్వానించిన IKF, కసాని జ్ఞానేశ్వర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తాంజానియా కబడ్డీ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అబ్దల్లా ముస్తఫా న్యోని, ఉపాధ్యక్షుడు మొహమ్మద్ జెంజా సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తాంజానియాలో కబడ్డీ భవిష్యత్తు, యువతలో క్రీడపై ఆసక్తి, భారత్‌తో సహకారం వంటి అంశాలపై వారు…

Read Full News

కబడ్డీని రగ్బీని మించి ప్రపంచ క్రీడగా మార్చాలి.. ఒలింపిక్స్‌లో కెన్యా ఆటగాళ్లే నా కల: జేమ్స్ అకామా

హైదరాబాద్: కబడ్డీని ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యంలోకి తీసుకెళ్లి, రగ్బీ తరహాలో ప్రతి దేశంలోనూ ఆడే క్రీడగా తీర్చిదిద్దాలని కెన్యా కబడ్డీ ప్రతినిధి జేమ్స్ అకామా ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్‌ (IKF) సమావేశంలో పాల్గొన్న ఆయన.. కబడ్డీ భవిష్యత్తుపై తన అభిప్రాయాలను వెల్లడించారు. జేమ్స్ అకామా మాట్లాడుతూ.. భారత్‌కు రావడం తనకు ఇదే మొదటిసారి కాదని తెలిపారు. గతంలో 2012, 2013 సంవత్సరాల్లో ఉత్తర భారతదేశంలోని పంజాబ్‌లో జరిగిన వరల్డ్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌ కోసం…

Read Full News

హైదరాబాద్‌లో అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్ జనరల్ బాడీ మీటింగ్.. 40కి పైగా దేశాల ప్రతినిధులు హాజరు

హైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌ కాసా గ్రాండ్‌ హోటల్‌ వేదికగా ఇంటర్నేషనల్‌ కబడ్డీ ఫెడరేషన్‌ (IKF) జనరల్‌ బాడీ సమావేశం జరుగుతోంది. కబడ్డీ క్రీడను దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తరించాలనే లక్ష్యంతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి కబడ్డీ ఫెడరేషన్‌కు సంబంధించిన ప్రముఖ ప్రతినిధులు, బోర్డు సభ్యులు కసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, వెంకటేష్ బండారి, గోవింద్ నారాయణ్ శర్మ తదితరులు హాజరయ్యారు. కబడ్డీకి ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో కసాని జ్ఞానేశ్వర్…

Read Full News

పరకాలలో కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై ప్రజల రిపోర్ట్ కార్డ్.. అభివృద్ధి ఎక్కడ?

పరకాల: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో పరకాల నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి విషయంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టామని చెబుతుండగా.. క్షేత్రస్థాయిలో ప్రజలు మాత్రం తమకు కనిపిస్తున్న మార్పు ఏమిటన్న ప్రశ్నను లేవనెత్తుతున్నారు. పరకాలలో నిర్వహించిన గ్రౌండ్ రిపోర్ట్‌లో పలువురు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. కొందరు ప్రభుత్వ పథకాలపై సానుకూలంగా స్పందించగా.. మరికొందరు స్థానిక సమస్యలు,…

Read Full News

50 ఏళ్లుగా అమీర్‌పేటలోనే ఉంటున్నాం.. ఇల్లు మాత్రం రాలేదు! కాంగ్రెస్ వచ్చాక మార్పు ఏంటి?

హైదరాబాద్ అమీర్‌పేటలో పేదల పరిస్థితిపై గ్రౌండ్ రియాలిటీ ఏంటి? డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని స్థానిక మహిళ ఆవేదన. కేసీఆర్ ప్రభుత్వంలో దరఖాస్తు చేసినా ఇల్లు రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎదురుచూపులు తప్పడం లేదని వ్యాఖ్య. హైదరాబాద్ అంటే అభివృద్ధికి మారుపేరు. భారీ రోడ్లు, మెట్రో, కమర్షియల్ భవనాలు, కొత్త నిర్మాణాలు.. నగరం రోజురోజుకూ రూపురేఖలు మార్చుకుంటోంది. కానీ ఇదే హైదరాబాద్‌లో కొన్ని కుటుంబాలు మాత్రం దశాబ్దాలుగా సొంత ఇంటి…

Read Full News

మల్లంపేట చెరువు చుట్టూ అసలు కథేంటి? 192 సర్వే నంబర్ నుంచి 296 వరకు వివాదం.. HYDRAA దృష్టి పెట్టాల్సిందేనా?

మల్లంపేట చెరువులో నిర్మాణాలు ఉన్నాయా? 192 సర్వే నంబర్‌నే 296గా మార్చారా? 260 వరకే సర్వే నంబర్లు ఉన్నాయని అధికారిక రికార్డులు చెబుతున్నాయా? ఫేక్ సర్వే నంబర్ల ఆరోపణల వెనుక అసలు కథేంటి? బాధితుల ఆస్తులు FTL, బఫర్ జోన్‌లోకి ఎందుకు వెళ్లాయి? HYDRAA కమిషనర్ రంగనాథ్ ఈ వ్యవహారంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందా? హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూముల విలువ పెరుగుతున్న కొద్దీ చెరువులు, ప్రభుత్వ భూములు, FTL, బఫర్ జోన్‌లకు సంబంధించిన వివాదాలు…

Read Full News

విద్యార్థులు రోడ్లపై.. ప్రభుత్వం ఏం చేస్తోంది? తెలంగాణలో విద్యా వ్యవస్థపై తీవ్ర విమర్శలు

తెలంగాణలో ప్రస్తుతం విద్యా వ్యవస్థకు సంబంధించి ఒక్క సమస్య కాదు.. అనేక సమస్యలు ఒకేసారి తెరపైకి వస్తున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్థుల ఆందోళనలు..పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు..టీచర్ల కొరత..ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులపై ఫిర్యాదులు..గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు..ఉద్యోగాల కోసం నిరుద్యోగుల పోరాటాలు.. ఇలా చూస్తే తెలంగాణ విద్యా వ్యవస్థపై అసలు ప్రభుత్వం దృష్టి పెట్టిందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇదే సమయంలో విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉండటంతో.. ఇన్ని శాఖలను ఒకేసారి…

Read Full News

కొండా కుటుంబానికి వరుస షాక్‌లు.. సురేఖ వివరణపై పీసీసీ అసంతృప్తి? ఏఐసీసీకి చేరనున్న వివాదం

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మంత్రి కొండా సురేఖ కుటుంబాన్ని చుట్టుముట్టిన రాజకీయ వివాదం రోజురోజుకూ ముదురుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు మంత్రి కుమార్తె కొండా సుష్మిత పటేల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపగా, మరోవైపు ఆ వ్యాఖ్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదంటూ మంత్రి కొండా సురేఖ పార్టీ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో మంత్రి మాజీ ఓఎస్డీ…

Read Full News

KBR Park One-Way Diversions: రెండు సంవత్సరాల ట్రాఫిక్ ఆంక్షలతో హైదరాబాద్ వాహనదారుల ఇబ్బందులు

హైదరాబాద్: నగరంలోని కీలక ప్రాంతమైన కాసు బ్రహ్మానందరెడ్డి (KBR) పార్క్ చుట్టూ చేపడుతున్న ఫ్లైఓవర్లు, అండర్‌పాస్ నిర్మాణ పనుల నేపథ్యంలో కొత్త వన్‌వే ట్రాఫిక్ విధానం అమల్లోకి వచ్చింది. ఆగస్టు 18 నుంచి ప్రారంభమైన ఈ మార్పులతో మొదటి రోజే పలుచోట్ల వాహనదారులు ట్రాఫిక్ రద్దీ, మార్గాలపై అయోమయం, అదనపు దూరం ప్రయాణించాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. H-CITI ప్రాజెక్టులో భాగంగా KBR పార్క్ పరిసరాల్లో మల్టీ-లెవల్ ఫ్లైఓవర్లు, డైరెక్షనల్ అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను…

Read Full News