‘జీవన్ కుమార్‌కు అండగా నిలవలేని బీఆర్ఎస్.. కార్యకర్తలను ఎలా కాపాడుతుంది?’ – కేటీఆర్, మహిపాల్ రెడ్డిని ప్రశ్నించిన నాయకుడు

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చేసిన వ్యాఖ్యలపై ఓ నాయకుడు తీవ్ర విమర్శలు చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త జీవన్ కుమార్ భూ వివాదాన్ని ప్రస్తావిస్తూ, పార్టీ నాయకత్వం సొంత కార్యకర్తకే అండగా నిలవలేదని ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ, పటాన్‌చెరులో దళిత సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త జీవన్ కుమార్ కుటుంబం తరతరాలుగా సాగు చేస్తున్న భూమిని ఎస్టీపీ ప్లాంట్ కోసం ప్రభుత్వ…

Read Full News

హైదరాబాద్ వాసులకు అలర్ట్: మంజీరా ప్రధాన పైప్‌లైన్ లీకేజీ.. పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం”

హైదరాబాద్: నగర ప్రజలకు హైదరాబాద్ జలమండలి కీలక హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్, ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు రాబోయే కొన్ని గంటల పాటు తాగునీటిని అత్యంత పొదుపుగా వినియోగించాలని సూచించింది. నగరానికి తాగునీటిని సరఫరా చేసే మంజీరా ఫేజ్-2 ప్రధాన పైప్‌లైన్‌లో భారీ లీకేజీ ఏర్పడటమే దీనికి కారణమని అధికారులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామం సమీపంలో కల్బుగూర్ నుంచి పటాన్‌చెరువుకు నీటిని తరలించే 1500 మిల్లీమీటర్ల వ్యాసం…

Read Full News

అమీన్‌పూర్ హైడ్రా డెమాలిషన్: భూమి వివాదాలు, ఆరోపణలు, ప్రజల ఆగ్రహం

ప్రధాన వార్తల్లోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన అంశాన్ని మాట్లాడుకుందాం — అమీన్‌పూర్‌లోని ఐలాపూర్ ప్రాంతంలో జరిగిన హైడ్రా డెమాలిషన్. కొంతమంది హైడ్రాను విమర్శిస్తున్నారు, కానీ నిజాలు తెలుసుకుని మాట్లాడటం చాలా ముఖ్యం. ఈ సమస్య కొత్తది కాదు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కూడా ఇదే ఐలాపూర్ తాండాలో డెమాలిషన్లు జరిగాయి. ఆ సమయంలో కోర్టు స్టే ఉన్నప్పటికీ భారీ పోలీసు బలగాలతో డెమాలిషన్ చేశారు. కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం భూములను ఖాళీ చేయించారని,…

Read Full News

పటంచెరులో 40 ఏళ్ల పోరాటం – డాక్టర్ అల్లాని కిషన్ రావు సేవలకు గౌరవం కోరుతున్న రైతులు

పటంచెరు–బొల్లారం ఇండస్ట్రియల్ ప్రాంతంలో గత 40 ఏళ్లుగా జరుగుతున్న రైతుల పోరాటం మరోసారి ముందుకు వచ్చింది. డాక్టర్ అల్లాని కిషన్ రావు గారి నాయకత్వంలో 1982లో ప్రారంభమైన ఈ ఉద్యమం, నదులు–కాల్వలు కలుషితమవడం వల్ల నష్టపోయిన 20 గ్రామాల రైతులకు న్యాయం చేయాలని లక్ష్యంగా సాగింది. రెండవ తరంగా ఈ పోరాటాన్ని కొనసాగించిన బీఎన్ రెడ్డి గారు, లకడారం మరియు పరిసర గ్రామాల రైతులతో కలిసి ఎన్నో సార్లు పోలీస్ కేసులు, అరెస్టులు, కోర్టు చుట్టాలు ఎదుర్కొన్నారు….

Read Full News

అమీన్‌పూర్ ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రిపోర్ట్ చేసిన జర్నలిస్టుపై దాడి – పట్టణచేరులో కలకలం

పటాన్‌చేరు / అమీన్‌పూర్:తెలంగాణలో మీడియా స్వేచ్ఛపై మరోసారి నీడ పడేలా ఘటన చోటుచేసుకుంది. అమీన్‌పూర్ ప్రాంతంలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ధైర్యంగా రిపోర్ట్ చేసిన సీనియర్ జర్నలిస్టు విత్తల్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. తహసీల్దార్ నేతృత్వంలో జరిగిన అధికార పరిశీలనలో 30 గుంటల ప్రభుత్వ భూమిని (నర్సరీ, పార్క్ కోసం కేటాయించిన భూమి) ఆక్రమించినట్లు రిపోర్ట్ రావడంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి 3 గంటల సమయంలో సుమారు 15మంది ముసుగులు…

Read Full News