ఉపఎన్నికలు, దొంగ ఓట్లు, బీసీ రిజర్వేషన్లు—మెట్టుగూడా కార్పొరేటర్ రాసూరి సునీత సంచలన వ్యాఖ్యలు

ఓకే టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మెట్టుగూడా కార్పొరేటర్ రాసూరి సునీత GHMC పరిధిలో రాబోయే ఉపఎన్నికలు, ఇటీవల జరిగిన జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక, అలాగే బీసీ రిజర్వేషన్ల తగ్గింపు వంటి అంశాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం 10 మంది ఎమ్మెల్యేల దళారీతనం, పార్టీ మార్పులపై వివాదం నెలకొనగా, ఎనిమిది మందికి స్పీకర్ ఇప్పటికే స్పష్టత ఇచ్చిన పరిస్థితి, మిగిలిన ఇద్దరు — దానం నాగేందర్ మరియు కడియం శ్రీహరి — ఇంకా సమయం కోరుతున్నారని…

Read Full News

“హైదరాబాద్‌లో 5 లక్షల కోట్ల భూకుంభకోణం జరుగుతోందా? – రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన ఆరోపణలు”

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి భూవివాదాలు కేంద్రబిందువుగా మారాయి. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ పేరుతో ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరలేపిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన Hyderabad Industrial Lands Transformation Policy (HILTP) ప్రజా ప్రయోజన పాలసీ కాదని, ఇది “దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణానికి నాంది” అని వ్యాఖ్యానించారు. ▼ 9292 ఎకరాల విలువైన పారిశ్రామిక భూములు లక్ష్యం? బాలానగర్, జీడిమెట్ట,…

Read Full News

ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ‘ఇంద్రమ్మ చీరలు’ పంపిణీ ప్రారంభం – సీఎం నిర్ణయంపై రాజకీయ వేడి

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కోటిమంది మహిళలకు ‘ఇంద్రమ్మ చీరలు’ పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీపై మంత్రి అనసూయ ధనసరి సీతక్కతో పాటు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి మహిళకు నాణ్యమైన ఇంద్రమ్మ చీర అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. అయితే ఈ పథకం పై రాజకీయ విమర్శలు…

Read Full News

కల్వకుంట్ల కవిత ‘కర్మ హిట్స్’ ట్వీట్ వివాదం: ఎందుకు పెట్టారు? ఎందుకు డిలీట్ చేశారు? సోషల్ మీడియాలో తీవ్ర చర్చ

జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక ఫలితాల తర్వాత బిఆర్ఎస్ పార్టీపై నెట్టింట్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చేసిన ఒక ట్వీట్ భారీ వివాదానికి దారితీసింది. “కర్మ హిట్స్” అంటూ ఆమె చేసిన వ్యాఖ్య, తర్వాత కేవలం పది నిమిషాల్లోనే ఆ పోస్టును డిలీట్ చేయడం రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కవిత చేసిన ట్వీట్ – వెంటనే డిలీట్ ఫలితాలు బిఆర్ఎస్‌కు ప్రతికూలంగా మారుతున్న వేళ,…

Read Full News

మాగంటి గోపీనాథ్ మరణం మిస్టరీనా? తల్లి మహానంద కుమారి సంచలన వ్యాఖ్యలు — రాజకీయ వాతావరణం వేడెక్కిన జూబిలీహిల్స్ ఉపఎన్నికలో సంచలనం

జూబిలీహిల్స్ మాజీ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ మరణంపై మళ్లీ వివాదం చెలరేగింది. ఆయన తల్లి మాగంటి మహానంద కుమారి చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీశాయి. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి, ఆయన మొదటి భార్య మలినీ, కుమారుడు తారక్ కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గోపీనాథ్ మరణం మిస్టరీగా మారిందని, ఆయన ఎప్పుడు చనిపోయారన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదని తల్లి పేర్కొన్నారు. “జూన్…

Read Full News

జూబ్లీహిల్స్‌లో నిరుద్యోగుల స్వరం — ఆస్మా బేగం ధైర్యపోరాటం

హైదరాబాద్ | జూబ్లీహిల్స్ ఉపఎన్నిక 2025జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఈసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఎందుకంటే, రాష్ట్రంలోని వేలాది నిరుద్యోగుల తరఫున పోటీ చేస్తూ ఆస్మా బేగం రంగంలోకి దిగారు. రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలను నిలబెట్టకపోవడంతో, “ఇది నా వ్యక్తిగత పోరాటం కాదు, ప్రతి నిరుద్యోగి తరఫున సాగుతున్న ఉద్యమం” అని ఆస్మా బేగం తెలిపారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, “బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేశాయి. ప్రతి సారి హామీలు ఇచ్చి…

Read Full News

కొత్త మంత్రి అజారుద్దీన్: తాత్కాలిక పదవా? తిరుగుబాటు స్వరాలా? కాంగ్రెస్ లో అంతర్గత కల్లోలం

తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో, పార్టీ లోపల నుండి కొత్త చర్చలు వెలువడుతున్నాయి. ఈ పదవి తాత్కాలిక బహుమతిలా ఇచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది విశ్లేషకులు, కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యల ప్రకారం — అజారుద్దీన్ మంత్రిత్వం ఎన్నికల వ్యూహం మాత్రమే, మైనారిటీ వర్గాలను ఆకర్షించడమే లక్ష్యం అని అంటున్నారు. ప్రచారంలో ఇంతవరకు కనిపించకపోయినా, హఠాత్తుగా మంత్రిగా తీసుకోవడం పార్టీ…

Read Full News

ఎన్నికల కోడ్ నడుమ అజారుద్దీన్ మంత్రి ప్రమాణం: రాజకీయ వాదనలు మిళితం

తెలంగాణలో ఉపఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో మాజీ క్రికెటర్, ఎమ్మెల్సీ అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడంతో రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. శుక్రవారం మధ్యాహ్నం 12:15 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అజారుద్దీన్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు హాజరవుతున్నారు. ఈ నిర్ణయం ఉపఎన్నికల నేపథ్యంలో వెలువడటం రాజకీయ విమర్శలకు దారితీసింది. బీజేపీ ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తూ, అజారుద్దీన్‌పై వివిధ…

Read Full News

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు: అజరుద్దీన్‌కు మంత్రి పదవి రాజకీయ వ్యూహమా? మైనారిటీల ఆకర్షణలో కాంగ్రెస్ ప్లాన్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు దగ్గర పడ్డాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా మైనారిటీల ఓట్లు కీలకం కావడంతో, కాంగ్రెస్ వ్యూహం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రెండు సంవత్సరాలుగా మైనారిటీకి క్యాబినెట్‌లో చోటు ఇవ్వకుండా, ఇప్పుడు అజరుద్దీన్‌ను మంత్రి పదవికి తీసుకోవడం ఎన్నికల స్ట్రాటజీ అనే అభిప్రాయం బలపడుతోంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 80 వేల ముస్లిం ఓటర్లు ఉన్నారు. వీరి మద్దతు గెలుపు–ఓటములను నిర్ణయించేంత కీలకం. విపక్షాలు కూడా ఇదే అంశంపై కాంగ్రెస్‌ను ఎటాక్…

Read Full News

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కాంగ్రెస్ దృష్టి – మంత్రులే ప్రచార బాధ్యతలు చేపట్టారు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ, పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ మరింతగా దృష్టి సారిస్తోంది. ఇప్పటివరకు ముగ్గురు మంత్రులే ఈ ఉపఎన్నిక పర్యవేక్షణలో ఉండగా, ఇప్పుడు మొత్తం కేబినెట్‌ను రంగంలోకి దించాలని నిర్ణయించింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నియోజకవర్గంలోని ఏడు డివిజన్లకు గాను ఒక్కో డివిజన్‌కు ఇద్దరు మంత్రుల చొప్పున బాధ్యతలు అప్పగించారు. ప్రతి మంత్రికి తమ పరిధిలో ప్రచారం చేయడమే కాకుండా, స్థానిక సమస్యలపై…

Read Full News