విద్యార్థులు రోడ్లపై.. ప్రభుత్వం ఏం చేస్తోంది? తెలంగాణలో విద్యా వ్యవస్థపై తీవ్ర విమర్శలు

తెలంగాణలో ప్రస్తుతం విద్యా వ్యవస్థకు సంబంధించి ఒక్క సమస్య కాదు.. అనేక సమస్యలు ఒకేసారి తెరపైకి వస్తున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్థుల ఆందోళనలు..పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు..టీచర్ల కొరత..ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులపై ఫిర్యాదులు..గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు..ఉద్యోగాల కోసం నిరుద్యోగుల పోరాటాలు.. ఇలా చూస్తే తెలంగాణ విద్యా వ్యవస్థపై అసలు ప్రభుత్వం దృష్టి పెట్టిందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇదే సమయంలో విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉండటంతో.. ఇన్ని శాఖలను ఒకేసారి…

Read Full News

పాలిటెక్నిక్ విద్యార్థుల నుంచి స్కూళ్ల వరకు.. తెలంగాణలో ఏం జరుగుతోంది?

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం విద్య, వైద్యం, విద్యార్థుల సమస్యలు ప్రధాన చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు, విద్యా విధానాలపై వస్తున్న విమర్శలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులపై ప్రశ్నలు రాజకీయంగా వేడి పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు హేమ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విద్య, వైద్యం ప్రజల ప్రాథమిక హక్కులని, ఈ రెండు రంగాలపై ప్రభుత్వాలు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. “ప్రజల…

Read Full News

కొండా సురేఖపై సీరియస్‌గా సీఎం రేవంత్? ఎమ్మెల్యేలకు కీలక సూచనలు.. సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు

మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్‌గా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ అంశంపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని, అప్పటివరకు ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దని సీఎం పార్టీ ఎమ్మెల్యేలకు సూచించినట్లు సమాచారం. ఇదే సమయంలో కొండా సురేఖ కుటుంబ వ్యవహారంపై పార్టీలో అసంతృప్తి పెరుగుతోందని, త్వరలోనే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తన నివేదికను అధిష్ఠానానికి పంపే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల చోటుచేసుకున్న వరుస పరిణామాలతో మంత్రి కొండా…

Read Full News

పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనకు పోలీసుల అడ్డంకులు.. శక్తి స్కీమ్ రద్దు చేయాలని డిమాండ్

హైదరాబాద్: తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన తీవ్రతరం అవుతోంది. పాలిటెక్నిక్ కోర్సులను శక్తి స్కీమ్ పరిధిలోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. తమ విద్యా వ్యవస్థ, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలు, ఉన్నత విద్యపై ప్రభావం పడుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో నిరసనల్లో పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల…

Read Full News