కబడ్డీని ఒలింపిక్స్కు తీసుకెళ్లడమే మా కల.. యూరప్లో కోచ్లు, నిధుల కొరతే ప్రధాన సవాళ్లు: జర్మనీ ప్రతినిధి ఇంద్రజీత్ సింగ్ జోసన్
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కబడ్డీని విస్తరించి.. ఒలింపిక్స్ స్థాయికి తీసుకెళ్లడమే అన్ని కబడ్డీ ఫెడరేషన్ల ప్రధాన లక్ష్యమని జర్మనీకి చెందిన కబడ్డీ ప్రతినిధి ఇంద్రజీత్ సింగ్ జోసన్ తెలిపారు. హైదరాబాద్లో జరుగుతున్న అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్ (IKF) సమావేశంలో పాల్గొన్న ఆయన.. కసాని జ్ఞానేశ్వర్ చొరవపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచ ఫెడరేషన్లను ఒకే వేదికపైకి తీసుకురావడం గొప్ప విషయం ప్రపంచంలోని మూడు కబడ్డీ ఫెడరేషన్ల ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకువచ్చినందుకు కసాని జ్ఞానేశ్వర్కు ఇంద్రజీత్ సింగ్ జోసన్ ధన్యవాదాలు…

