హైదరాబాద్‌లో 9,292 ఎకరాల పారిశ్రామిక భూముల మార్పిడి: రేవంత్ ప్రభుత్వం తెరలేపిన భూకుంభకోణం అంటూ బీఆర్‌ఎస్ ఆరోపణలు

హైదరాబాద్‌లో 9,292 ఎకరాల పారిశ్రామిక భూముల మార్పిడి: రేవంత్ ప్రభుత్వం తెరలేపిన భారీ భూకుంభకోణమని బీఆర్‌ఎస్ ఆరోపణలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక వాడల్లో ప్రభుత్వ భూముల మార్పిడి పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ భూకుంభకోణానికి తెరలేపిందని బీఆర్‌ఎస్ తీవ్ర ఆరోపణలు చేసింది. దాదాపు 9,292 ఎకరాల పారిశ్రామిక భూములను రియల్ ఎస్టేట్ మార్పిడికి అనుమతించే ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ’ పేరుతో ఈ స్కామ్ జరుగుతోందని పార్టీ ప్రతినిధులు విమర్శించారు. పారిశ్రామిక భూములు…

Read Full News

బీసీ 42% రిజర్వేషన్–కేటీఆర్ విచారణ అనుమతిపై రాజకీయ సంచలనం: తెలంగాణలో వేడెక్కిన చర్చలు

తెలంగాణ రాజకీయాల్లో రెండు ముఖ్య పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసాయి. ఒకవైపు బీసీ 42% రిజర్వేషన్ అంశంపై ఉద్రిక్తతలు పెరుగుతుండగా, మరోవైపు ఫార్ములా E కార్ రేస్ ఫండ్స్ దుర్వినియోగం కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కేటీఆర్ విచారణకు గ్రీన్ సిగ్నల్ – ఏసీబీ సన్నద్ధం ఫార్ములా E కార్ రేస్ నిర్వహణలో చోటుచేసుకున్న ఫండ్ మిస్యూస్, నిర్ణయాల దుర్వినియోగంపై విచారణ కోరుతూ…

Read Full News

ఫార్ములా–ఈ కుంభకోణం: కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ – ఏసీబీ అరెస్ట్ దిశగా చర్యలు సత్వరం?

ఫార్ములా–ఈ కార్ రేస్ నిర్వహణలో భారీ అవకతవకలు జరిగాయని గత రెండేళ్లుగా సాగుతున్న చర్చ మరోసారి హాట్ టాపిక్ అయింది. మునుపటి ప్రభుత్వం కాలంలో ప్రజా నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో మాజీ మంత్రి కేటీఆర్‌పై దర్యాప్తు కొనసాగుతుండగా, ఇప్పుడు ఈ కేసులో కీలకమైన మలుపు తిరిగింది. ఇప్పటికే ఏసీబీ అధికారులు ఫార్ములా–ఈ రేస్‌కు సంబంధించిన అన్ని పత్రాలను, నిర్ణయాలను, ఫండ్స్ వినియోగాన్ని, సంబంధిత అధికారుల స్టేట్‌మెంట్‌లను పరిశీలించి ముఖ్యమైన ఆధారాలను సేకరించారని ప్రభుత్వం వెల్లడించింది. అధికారులలో…

Read Full News

బీహార్ ఎన్నికల వేడి – జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు, పార్టీల లోపాలు–విజయాలు విశ్లేషణ

ఇటీవల బీహార్ ఎన్నికలు ఒకవైపు, తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక మరోవైపు దేశవ్యాప్తంగా రాజకీయ చర్చలకు దారితీశాయి. బిఆర్ఎస్‌కు అనుకూలంగా సర్వేలు వచ్చినప్పటికీ, చివరకు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదే సమయంలో బీహార్‌లో కాంగ్రెస్ పూర్తిగా కుప్పకూలగా, ప్రశాంత్ కిషోర్ పార్టీ కూడా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. మరోవైపు పార్టీ మార్చిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎన్నికలు కూడా రావచ్చని కోర్టుల తీర్పులతో…

Read Full News

ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ‘ఇంద్రమ్మ చీరలు’ పంపిణీ ప్రారంభం – సీఎం నిర్ణయంపై రాజకీయ వేడి

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కోటిమంది మహిళలకు ‘ఇంద్రమ్మ చీరలు’ పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీపై మంత్రి అనసూయ ధనసరి సీతక్కతో పాటు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి మహిళకు నాణ్యమైన ఇంద్రమ్మ చీర అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. అయితే ఈ పథకం పై రాజకీయ విమర్శలు…

Read Full News

జూబ్లీ హిల్స్ బైపోల్స్: ఇద్దరు మంత్రులపై అధిష్టానం అసంతృప్తి – వివరణ కోరనున్న కాంగ్రెస్ లీడర్‌షిప్

జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ, ప్రచారంలో పలు మంత్రుల పనితీరుపై పార్టీ హైకమాండ్ అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు చెందిన ఇద్దరు ముఖ్య మంత్రులపై అధిష్టానం అసహనం వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హైకమాండ్‌కు చేరిన నివేదికల ప్రకారం, ఈ ఇద్దరు మంత్రులు తమకు కేటాయించిన డివిజన్లలో సీరియస్‌గా ప్రచారం చేయలేదని,“చుట్టూ తిరిగే హాజరు చూపించడం తప్ప—కనీస స్థాయి వ్యూహాత్మక పని కూడా చేయలేద”అని ఫిర్యాదులు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర…

Read Full News

తెలంగాణలో పెరుగుతున్న కష్టాలు: ప్రజలు గోషపడుతుంటే, నేతలు కోతలు — అవినీతి, అవ్యవస్థపై ఘాటు విమర్శలు

తెలంగాణలో ప్రతి తరగతి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. శ్రమజీవులు, కార్మికులు, మేస్త్రీలు, ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రిషియన్లు, ఆటో–క్యాబ్ డ్రైవర్లు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు— ఎవరి బతుకులోనూ స్థిరత్వం కనిపించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూలీలకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమయానికి వేతనాలు రాకపోవడం పెద్ద భారంగా మారింది. వ్యవసాయ రంగం పూర్తిగా నష్టాల్లో మునిగిపోగా, వరి–పత్తి కొనుగోలు సమస్యతో రైతులు తీవ్ర గోషలో ఉన్నారు. వరి తడిసిందని కొనకుండా, పత్తి కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు…

Read Full News

తెలంగాణ లో పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్: రిజర్వేషన్లు, నిధులు, ఫ్యూచర్ సిటీ వివాదంపై హీట్ పెరుగుతోంది

తెలంగాణ వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు ప్రాముఖ్యమైన అంశాలు చర్చించగా, పంచాయతీ ఎన్నికలను 50% రిజర్వేషన్ల పరిమితిలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ ఎన్నికల విషయానికి వస్తే—బీసీ రిజర్వేషన్లపై న్యాయస్థానాల్లో స్పష్టత రావాల్సి ఉండటంతో, ఆ ఎన్నికలను ప్రస్తుతం వాయిదా వేయాలని ప్రభుత్వం భావించింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే…

Read Full News

తెలంగాణలో వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు: రిజర్వేషన్ల సవాళ్లు – 3000 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులపై ప్రమాదం

వచ్చే నెలలో పంచాయతీ రాజ్ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం ప్రకటించారు. సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మీడియా సమావేశంలో ముఖ్య అంశాలను వెల్లడించారు. 🔹 50% రిజర్వేషన్ల పరిమితిలోనే పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి పంచాయతీ ఎన్నికలను 50%…

Read Full News

టిఎస్ పాలిటిక్స్‌లో గందరగోళం: 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీం కోర్టు మొట్టికాయలు – కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపీలకు తలకాయ నొప్పులే!

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం నిశ్శబ్దం కన్నా అకస్మాత్తుగా పెను చర్చలు మొదలయ్యాయి. ఫిరాయింపుల కేసులో 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు కఠిన వైఖరి తీసుకోవడంతో టిఎస్ పాలిటిక్స్ మొత్తం కుదేలైంది. కోర్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు కోర్టు దిక్కరణ కింద నోటీసులు పంపించడంతో కథ మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. స్పీకర్‌గా ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన గడ్డం ప్రసాద్ ఇప్పుడు రెండు వైపులా చిక్కుల్లో చిక్కుకున్నారు. ధర్మాసనం ఇచ్చిన హెచ్చరిక తర్వాత స్పీకర్…

Read Full News