“స్పీకర్ను అవమానిస్తే ఊరుకోం.. ప్రభుత్వం అండగా ఉంటుంది”.. సభలో అధికారపక్షం ఫైర్
తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ వ్యవహారంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం కొనసాగింది. స్పీకర్ మాట్లాడుతున్న సమయంలో సభ్యులు గౌరవంగా కూర్చొని వినాలని, సభా నిబంధనలను పాటించాలని అధికారపక్ష సభ్యులు ప్రతిపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేయడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. సభలో ప్రతిపక్ష సభ్యులు పదేపదే వెల్లోకి వచ్చి నినాదాలు చేయడం, స్పీకర్ ఆదేశాలను పట్టించుకోకపోవడం, పోడియం వద్దకు వెళ్లి వాదించడం ప్రజాస్వామ్య పద్ధతి కాదని…

