తెలంగాణ రెవెన్యూ శాఖలో అక్రమ పదోన్నతుల ఆరోపణలు.. డైరెక్ట్ రిక్రూట్ నాయబ్ తహసీల్దారుల ఆవేదన
తెలంగాణ రెవెన్యూ శాఖలో అక్రమ పదోన్నతులు, బదిలీలు జరిగాయన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. అర్హత, సీనియారిటీ, సేవా నిబంధనలను పక్కనపెట్టి కొందరు అధికారులకు పదోన్నతులు కల్పించారని, దీంతో డైరెక్ట్ రిక్రూట్ నాయబ్ తహసీల్దారులకు తీవ్ర అన్యాయం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ శాఖలో భూ వివాదాలు, అక్రమ లావాదేవీలు తరచూ వెలుగులోకి వస్తున్న వేళ, ఇప్పుడు సర్వీస్ అంశాల్లోనూ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు మరింత చర్చనీయాంశంగా మారాయి. కొందరు తహసీల్దారులకు నిబంధనలకు విరుద్ధంగా జిల్లా…

