రాయదుర్గం ఎకరం ₹237 కోట్లు.. రైతుల భూములకు అదే రేటు ఇస్తారా?

నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణలో భూముల విలువలు, రైతుల నష్టపరిహారం అంశంపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా రాయదుర్గం ప్రాంతంలో టీజీఐసీ నిర్వహించిన భూముల వేలంలో ఎకరం ధర ₹237 కోట్లకు చేరడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. 6.29 ఎకరాల భూమిని ₹1490.73 కోట్లకు గౌర వెంచర్స్ దక్కించుకోవడంతో.. “ప్రభుత్వ భూమికి వందల కోట్లు వస్తే రైతు భూమికి ఎందుకు రావు?” అనే ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. రావిర్యాల ప్రాంతంలో…

Read Full News

25 రోజులు ధాన్యం కల్లంలోనే ఉంది”.. కొనుగోళ్లపై రైతుల ఆవేదన, ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై రైతుల ఆవేదన రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే అకాల వర్షాలతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు, మరోవైపు ప్రభుత్వ కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. “25 రోజులుగా ధాన్యం కల్లంలోనే ఉంది.. ఇంకా లారీలు రావడం లేదు.. ట్రాక్టర్లు రావడం లేదు” అంటూ రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక రైతు మాట్లాడుతూ, “బస్తాలు మేమే కొనుక్కొచ్చాం, మేమే నింపుకున్నాం. 25 రోజుల నుంచి ధాన్యం కల్లంలోనే ఉంది. ఇంకా…

Read Full News

అకాల వర్షంతో అన్నదాతల ఆవేదన.. నీట మునిగిన ధాన్యం, కొనుగోళ్లలో ఆలస్యం రైతులకు శాపం

తెలంగాణలో అకాల వర్షాలు అన్నదాతలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇప్పటికే పంట కోతలు పూర్తి చేసి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతులు ఇప్పుడు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. వరుసగా రెండు రోజుల పాటు కురిసిన వర్షాలతో పలు జిల్లాల్లో ధాన్యం కుప్పలు నీట మునిగిపోయాయి. కొనుగోలు కేంద్రాలు చిన్నపాటి చెరువులను తలపించే పరిస్థితి నెలకొంది. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు…

Read Full News

మాటలు మాత్రమే.. రైతు జీవితంలో మార్పు లేదు” – రైతుల ఆవేదన

ప్రభుత్వాలు రైతుల కోసం ఎన్నో హామీలు ఇస్తున్నప్పటికీ భూమి స్థాయిలో మాత్రం పరిస్థితులు మారడం లేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “మాటలే ఎక్కువ.. చేతల్లో మాత్రం ఏమీ కనిపించడం లేదు” అంటూ రైతులు తమ అసంతృప్తిని వెల్లడిస్తున్నారు. ఒక రైతు మాట్లాడుతూ, “ఆ రోజు కూడా ధాన్యం అమ్మడానికి చాలా ఇబ్బందులు పడ్డాం. యార్డ్ దొరకలేదు, గంటల తరబడి లైన్లలో నిలబడ్డాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. రైతు పరిస్థితి మారలేదు” అని వాపోయాడు….

Read Full News

జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌పై చర్యలు లేవు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం

జగిత్యాలలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు మరియు కేంద్ర ప్రభుత్వం వరి, మక్కజొన్న కొనుగోళ్లపై నిరసనలు కొనసాగుతున్న సమయంలో ఆర్టీసీ డ్రైవర్ అశోక్ చేసిన వ్యాఖ్యలపై వివాదం నెలకొన్న నేపథ్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. అశోక్ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే వ్యక్తం చేశాడని, దాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రైతుల సమస్యలపై తన అభిప్రాయాన్ని చెప్పినందుకు ఆయనపై ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకోలేదని వెల్లడించారు. మంత్రి మాట్లాడుతూ, “జగిత్యాలలో జరుగుతున్న…

Read Full News

భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి.. గవర్నర్‌ను కలిసిన తెలంగాణ రక్షణ సేన, ధర్మ సమాజ్ పార్టీ నేతలు

భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ Telangana Rakshana Sena మరియు Dharma Samaj Party నాయకులు రాష్ట్ర గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల, పరిగి ప్రాంతాల్లో భూసేకరణ, అలాగే టీపీఎల్ఆర్ ప్రాజెక్ట్ కారణంగా భూములు కోల్పోతున్న రైతుల సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ, భూములు కోల్పోయిన రైతుల పరిస్థితి నీళ్లలో బయటపడిన చేపల మాదిరిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఖమ్మం వెలుగుమట్ల ప్రాంతంలో…

Read Full News

10 రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి చేస్తాం.. రైతులకు క్షమాపణ చెప్పిన మంత్రి

రాష్ట్రంలో ధాన్యం సేకరణ ఆలస్యం కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ప్రభుత్వం తరఫున మంత్రి క్షమాపణ చెప్పారు. ఈసారి అంచనాలకు మించి ధాన్యం రావడంతో సమస్యలు తలెత్తాయని, రైతులు గత 15 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. ప్రభుత్వం రైతుల కోసం ఎప్పుడూ కట్టుబడి పనిచేస్తుందని, రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు. రాబోయే 10 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు….

Read Full News

రైతులను గాలికొదిలేసిన ప్రభుత్వం.. ధాన్యం కొనుగోళ్లపై తీవ్ర ఆగ్రహం

రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతోందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. యూరియా సరఫరా నుంచి ధాన్యం కొనుగోళ్ల వరకు ప్రతి విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతు బంధు నిధుల విడుదలలో ఆలస్యం, విద్యుత్ సరఫరాలో సమస్యలు, ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని రైతులు చెబుతున్నారు. మిల్లర్లు అదనపు తరుగు పేరుతో రైతులను…

Read Full News

రైతు రాజు ఎక్కడ?.. లైన్లలోనే రైతు బతుకు ముగుస్తోందా?

“రైతు రాజు” అని చెప్పే ప్రభుత్వాల మాటలు ఒకవైపు ఉంటే.. నేల మీద రైతుల పరిస్థితి మాత్రం రోజురోజుకూ దారుణంగా మారుతోందనే ఆవేదన గ్రామాల్లో బలంగా వినిపిస్తోంది. ఎరువుల కోసం ఒక లైన్, డీజిల్ కోసం మరో లైన్, గ్యాస్ కోసం ఇంకో లైన్.. చివరికి రైతు జీవితమంతా లైన్లలోనే గడుస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం చేయాలంటే పెట్టుబడులు పెరుగుతున్నాయి. డీజిల్ ధరలు, ఎరువుల ధరలు, విత్తనాల ఖర్చులు అన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి. కానీ…

Read Full News

80% ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయంటే ఏ శిక్షకైనా సిద్ధం”.. సీఎం వ్యాఖ్యలకు కేటీఆర్ సవాల్

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల అంశం మరోసారి రాజకీయ దుమారానికి దారితీసింది. రాష్ట్రంలో 80 శాతం పంట కొనుగోళ్లు పూర్తయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. నిజంగానే 80 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని నిరూపిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్, రాష్ట్రవ్యాప్తంగా రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్న పరిస్థితిలో ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు. “80…

Read Full News