20 రోజులుగా కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం.. రైతుల ఆవేదన, ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి
“20 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే ఉంది. రెండు సార్లు వర్షాలు పడ్డాయి. కానీ ఒక్క ప్రజాప్రతినిధి కూడా వచ్చి మా పరిస్థితిని చూడలేదు” అంటూ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం పెద్దఎత్తున ప్రకటనలు చేస్తున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ఇప్పటికే కోసి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం రోజుల తరబడి అక్కడే ఉండిపోవడంతో వర్షాలకు తడిసి నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. “ప్రభుత్వం…

