కర్నూల్ వాల్వో బస్ దుర్ఘటన – అక్రమ స్లీపర్ బస్సులపై తెలంగాణ ప్రభుత్వం సోదాలు ప్రారంభం

కర్నూలు జిల్లా చినటేకూరు వద్ద చోటుచేసుకున్న వాల్వో బస్సు ప్రమాదం దేశవ్యాప్తంగా మరోసారి ప్రైవేట్ ట్రావెల్స్‌ వ్యవస్థలోని అక్రమాలను బహిర్గతం చేసింది. పాలెం నుంచి చినటేకూరు వైపు వస్తున్న వాల్వో స్లీపర్ బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 19 మంది సజీవదహనమై, మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ బస్సుకు అధికారికంగా కేవలం 43 సీట్లు మాత్రమే అనుమతి ఉండగా, దాన్ని అక్రమంగా స్లీపర్ బస్సుగా మార్చి నడిపినట్లు…

Read Full News

కర్నూలు బస్సు దుర్ఘటనపై అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం — “ఇది ప్రమాదం కాదు, రాజకీయ హత్య”

కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేట్ బస్సు దుర్ఘటనలో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనపై అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర స్పందన వ్యక్తం చేశారు. ఓకే టీవీతో మాట్లాడుతూ ఆయన ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థల నిర్లక్ష్యం, ప్రభుత్వాల వైఫల్యం, మరియు రాజకీయ మాఫియా మధ్య ఉన్న నక్సస్ వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని అన్నారు. అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ —

Read Full News

సీఎం రేవంత్ ఆదేశాలతో చెక్ పోస్టుల ఎత్తివేత — రవాణా శాఖలో ఏఐ మార్పులు, ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీపై ప్రజల ఆవేదన

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రవాణా చెక్ పోస్టులను ఎత్తివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ ఆధారంగా, కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం బుధవారం సాయంత్రం 5 గంటలలోగా అన్ని చెక్ పోస్టులను మూసివేసి రికార్డులు జిల్లా కార్యాలయాలకు తరలించాలని ఆదేశించారు. చెక్ పోస్టుల్లో ఇంతకుముందు ఏసీబీ తనికీల్లో లెక్కల్లో లేని పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం…

Read Full News

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో టిజేఎస్ మద్దతు కోరిన కాంగ్రెస్ నేత

తెలంగాణ ఉద్యమ యోధుడు, టిజేఎస్ వ్యవస్థాపకుడు కోదంరాం గారి పాత్ర తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో అశేషమైనది. తెలంగాణ కోసం ఆయన నిస్వార్థంగా, నిజాయితీగా పోరాడినవారిలో అగ్రగణ్యులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన నిరంకుశ వ్యవహారాలను వ్యతిరేకిస్తూ ఆయన టిజేఎస్ పార్టీని స్థాపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంలో, ముఖ్యంగా 2023 ఎన్నికల్లో టిజేఎస్ మరియు కమ్యూనిస్టు పార్టీల మద్దతు కీలక పాత్ర పోషించిందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని…

Read Full News

కల్వకుర్తి ఆశ్రమ పాఠశాల గర్ల్స్ హాస్టల్‌లో దయనీయ పరిస్థితులు: విద్యార్థినుల ఆవేదన

నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఆశ్రమ పాఠశాల గర్ల్స్ హాస్టల్‌లో విద్యార్థినులు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. హాస్టల్‌లో ఆహార నాణ్యత లేకపోవడం, శుభ్రత లోపించడం, తాగునీరు అందకపోవడం వంటి సమస్యలపై విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినుల ప్రకారం, హాస్టల్‌లో వండే భోజనం సరిగా ఉడకకపోవడం, కొన్ని సార్లు వారే వండుకోవాల్సిన పరిస్థితి రావడం జరుగుతోందని తెలిపారు. డైనింగ్ హాల్‌లో దుర్వాసన వస్తోందని, వాష్‌రూమ్స్ చెదిరిపోయి ఉన్నాయని, చుట్టూ కుక్కలు తిరుగుతున్నాయని వారు చెప్పారు. “నిన్న…

Read Full News

రేవంత్ రెడ్డి నియామకాలపై తీవ్ర విమర్శలు – అంబేద్కర్ ఆర్‌పిఐ నేత గాలి వినోద్‌ కుమార్ ఘాటైన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో జరిగిన ఆర్‌పిఐ పార్టీ సమావేశంలో అంబేద్కర్ గారి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గాలి వినోద్‌ కుమార్ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్‌ రెడ్డి నియామకాలపై తీవ్రంగా స్పందించారు.అయన మాట్లాడుతూ — “రాజ్యాంగబద్ధమైన అవకాశాలను పక్కనబెట్టి రేవంత్‌ రెడ్డి తన వర్గానికి 72% పదవులు కేటాయించటం అన్యాయం. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధం. ఈ విధానాన్ని అడ్డుకోవడమే ప్రజాస్వామ్య రక్షణ” అని అన్నారు. గాలి వినోద్‌ కుమార్ మాట్లాడుతూ “ప్రొఫెసర్ హరగోపాల్‌, కోదం రామరెడ్డి లాంటి నేతలు…

Read Full News

విద్యార్థుల జీవితం ప్రమాదంలో: ఫీజు రీయింబర్స్‌మెంట్, జీతాలు నిలిచిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

ఎల్బీ నగర్ శాఖతో పాటు రంగారెడ్డి జిల్లా నాయకులు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలు కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు గుప్పించాయి. “ఇది న్యాయమైన పోరాటం, అవసరమైన డిమాండ్” అంటూ వారు ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మాది అధ్యక్షుడు రవీందర్ గారు, కార్పొరేటర్ లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో వారు ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. “పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తూ విద్యార్థుల…

Read Full News

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్‌పై హైకోర్టు తీర్పు – ముదిరాజుల వాదనలు, ప్రభుత్వంపై విమర్శలు

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్‌పై హైకోర్టు తీర్పు వెలువడబోతోంది. ముదిరాజుల నాయకులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, రాజకీయ పార్టీల వైఖరిని తీవ్రంగా విమర్శించారు. బీసీలకు న్యాయం చేయాలంటూ గళం వినిపించారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి బీసీల రిజర్వేషన్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. 42% రిజర్వేషన్ అమలు విషయంలో హైకోర్టు తీర్పు వెలువడబోతోంది. ఈ నేపథ్యంలో ముదిరాజుల నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బీసీలను వంచిస్తోందని, ముదిరాజులకు విద్యా, ఉద్యోగ అవకాశాలు అందట్లేదని…

Read Full News

రాయదుర్గంలో ప్రభుత్వ భూమి ఎకరానికి ₹177 కోట్లు — రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో సంచలనం

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదిపేసిన మరో సంచలన రేటు రాయదుర్గంలో నమోదైంది. ఇటీవల ప్రభుత్వ భూముల వేలంలో ఎకరానికి దాదాపు ₹177 కోట్లకు భూమి అమ్ముడుపోవడం మార్కెట్‌లో చర్చనీయాంశమైంది. అంటే ప్రతి చదరపు గజం ధర ₹3.75 లక్షలు అన్నమాట! ఈ రేటు హైదరాబాద్ నగరంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ధరల్లో ఒకటిగా నిలిచింది. రాయదుర్గంలోని నాలెడ్జ్ పార్క్ పరిధిలో జరిగిన ఈ వేలం రియల్ ఎస్టేట్ వర్గాల్లో విశేష చర్చకు దారితీసింది. నిపుణుల ప్రకారం,…

Read Full News