ఉస్మానియా-గాంధీలో పాతుకుపోయిన ప్రొఫెసర్లు.. బదిలీలు తప్పించుకునేందుకు భారీ లాబీయింగ్?

తెలంగాణ వైద్యశాఖలో బదిలీల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో నాలుగైదు సంవత్సరాలకోసారి ఉద్యోగుల బదిలీలు జరుగుతుంటాయి. అయితే ఉస్మానియా, గాంధీ వంటి ప్రముఖ టీచింగ్ ఆసుపత్రుల్లో మాత్రం కొందరు ప్రొఫెసర్లు దాదాపు 20 నుంచి 25 సంవత్సరాలుగా అదే స్థానాల్లో కొనసాగుతున్నారనే ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న సాధారణ బదిలీల్లో కూడా తమను ఇతర ప్రాంతాలకు పంపకుండా పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకంగా న్యూరోసర్జరీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ…

Read Full News

జన్ విశ్వాస్ రూల్స్ అమలు: ఫార్మా తప్పులకు జైలు కాదు, ఫైన్‌తో పరిష్కారం?

రాష్ట్రంలో ఫార్మా కంపెనీలు, మెడికల్ షాపులపై అమలవుతున్న నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జన్ విశ్వాస్ చట్టం–2023 ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం కొన్ని రకాల తప్పులకు ఇకపై కోర్టు కేసులు కాకుండా జరిమానాతోనే పరిష్కారం చేసుకునే అవకాశం కల్పించబడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ జీఓ జారీ చేసి, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) డైరెక్టర్ జనరల్‌ను “కాంపౌండింగ్ అథారిటీ”గా…

Read Full News

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల్ని తిప్పి పంపకూడదు – కఠిన రిఫరల్ సిస్టంపై సర్కార్ కసరత్తు

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన ఏ రోగినైనా ఇకపై “సౌకర్యాలు లేవు”, “కేసు సీరియస్” అనే కారణాలతో తిప్పి పంపేందుకు వీలు ఉండదని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేయనుంది. రోగి పరిస్థితి ఎలా ఉన్నా ఆసుపత్రి గడప తొక్కిన వెంటనే అడ్మిట్ చేయాల్సిందే అన్న నిబంధనను అమల్లోకి తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పటిష్టమైన రిఫరల్ సిస్టం అమలుపై అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసే అంశంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర…

Read Full News