తెలంగాణ కోసం పోరాడాం.. కానీ ఉద్యమకారులకు న్యాయం జరగలేదు: తెలంగాణ సంపత్ ఆవేదన

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యమకారుడు తెలంగాణ సంపత్ తన పోరాట జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వేలాది మంది విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగాలు చేశారని, కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసలు ఉద్యమకారులకు తగిన గుర్తింపు, న్యాయం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంపత్ మాట్లాడుతూ చిన్న వయస్సులోనే తెలంగాణ ఉద్యమంలోకి అడుగుపెట్టానని తెలిపారు. మూడో తరగతిలో చదువుతున్న సమయంలోనే ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్నానని, అనంతరం బాలల సంఘం…

Read More

తెలంగాణ అస్తిత్వంపై దాడులు సహించం.. ఆవిర్భావ దినోత్సవం రోజున రాజకీయ సభలపై ఉద్యమకారుల ఆగ్రహం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి, భాష, ఉద్యమ స్ఫూర్తిని కించపరిచే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తెలంగాణ ఉద్యమకారులు హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలువురు ఉద్యమ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం వేలాది మంది యువత పోరాడారని, అనేక మంది అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ఇతర రాష్ట్రాల రాజకీయ…

Read More

తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తే ఊరుకోం.. ఉద్యమకారుల హామీలు వెంటనే అమలు చేయాలి: తెలంగాణ వాదుల హెచ్చరిక

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు తెలంగాణ వాదులు రాష్ట్ర అస్తిత్వం, ఉద్యమ ఆకాంక్షలు, ఉద్యమకారుల సంక్షేమం వంటి అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వక్తలు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కేవలం ప్రత్యేక రాష్ట్రం కోసం మాత్రమే కాదని, తెలంగాణ ప్రాంత అస్తిత్వం, సంస్కృతి, స్వాభిమానం, హక్కుల పరిరక్షణ కోసం కూడా జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు లేదా చర్యలను సహించబోమని…

Read More

తెలంగాణ అస్తిత్వం, మేధావులపై కేసులు, ఎన్టీఆర్ విగ్రహ వివాదం.. ఆగ్రహంతో మండిపడ్డ తెలంగాణ వాదులు

తెలంగాణ అస్తిత్వం, మేధావులపై కేసులు, ఎన్టీఆర్ విగ్రహ వివాదం, ఆంధ్ర-తెలంగాణ రాజకీయ ఉద్రిక్తతలపై తెలంగాణ వాదులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ తెలంగాణ భావజాలాన్ని అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై నమోదైన కేసులు, జర్నలిస్టులపై పోలీసు చర్యలు, తెలంగాణలో ఆంధ్ర రాజకీయ ప్రభావం పెరుగుతోందనే అంశాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వక్తలు మాట్లాడుతూ తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రొఫెసర్…

Read More

కేసీఆర్‌కు నోటీసులపై తీవ్ర విమర్శలు: తెలంగాణ గడ్డను అవమానిస్తున్న పాలకులు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించి, రాష్ట్ర అవతరణకు తన జీవితాన్ని అంకితం చేసిన బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నోటీసులు కేవలం ఒక నాయకుడికి మాత్రమే కాదు, తెలంగాణ గడ్డకే, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికే అవమానమన్న భావన బలంగా వ్యక్తమవుతోంది. కేసీఆర్‌పై చర్యల పేరుతో జరుగుతున్న వ్యవహారాల వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్న ప్రశ్నలు ప్రజల్లో మొదలయ్యాయి. తమ…

Read More

తెలంగాణ అస్తిత్వం పేరుతో కవిత కొత్త పార్టీ.. ప్రజలు నమ్ముతారా? అనుమానాల మధ్య రాజకీయ ప్రయాణం

తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ కావాలంటూ.. సామాజిక తెలంగాణ సాధన కోసం కలిసి నడుద్దామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవితకు ఆమోదం కూడా లభించినట్టు సమాచారం. బంజారాహిల్స్‌లో నిర్వహించిన తెలంగాణ జాగృతి సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యచరణ, ప్రజా సమస్యల గుర్తింపు, పరిష్కార దిశగా కమిటీల ఏర్పాటు…

Read More

తెలంగాణ ఆత్మగౌరవంపై దాడులు సహించంవిగ్రహాల నుంచి ఐడీపీఎల్ భూముల వరకు పోరాటం కొనసాగుతుంది

తెలంగాణ ప్రజలు ఇప్పటికే ఎన్నో గాయాలతో ఉన్నారని, ఆ గాయాలపై మళ్లీ పుండు మీద కారం చల్లినట్టుగా పాలకులు వ్యవహరిస్తున్నారని నేత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గాయపడ్డ ప్రజలు మార్పు కోసం కొంత శాంతన పొందాలని భావిస్తే, మరింత బాధను మిగిల్చే నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. విగ్రహాల ఏర్పాటు మాత్రమే సమస్య కాదని, అక్రమ పద్ధతుల్లో, అహంకారంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా తీసుకునే నిర్ణయాలే అసలు సమస్య అని స్పష్టం చేశారు. తెలంగాణ…

Read More