మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ దూకుడు: అభివృద్ధి పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు
తెలంగాణలో రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకోబోతోందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రజలు స్పష్టమైన నిర్ణయానికి వచ్చారని, అభివృద్ధి జరగాలంటే బీజేపీకే అధికారాన్ని ఇవ్వాలని భావిస్తున్నారని వారు చెబుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని బీజేపీ ఆరోపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను అభివృద్ధికి వినియోగించకుండా అవినీతి, అక్రమాలకు దారి మళ్లించారని విమర్శలు గుప్పిస్తోంది….

