మూసి పునర్జీవానికి కీలక ముందడుగు… 50 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్, టిడిఆర్ పరిహారంపై సందేహాలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసి పునర్జీవ ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది. మూసి నది పునరుద్ధరణ, పరివాహక ప్రాంతాల అభివృద్ధి కోసం 50 ఎకరాల భూసేకరణ చేపట్టాలని మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL) నిర్ణయించింది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ బుధవారం జారీ అయింది. హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ బాపుఘాట్ వరకు 9.2 కిలోమీటర్లు, ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 11.8 కిలోమీటర్ల పరిధిలో భూములను సేకరించనున్నారు….

Read Full News

నారాయణపేట మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్యపై వివాదం… అసలు కారణాలు వెలుగులోకి తేవాలని డిమాండ్

నారాయణపేట జిల్లా మక్తల్‌లో బీజేపీ అభ్యర్థిగా ఉన్న గిరిజన నాయకుడు ఎరుకల మహాదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతల రాజకీయ ధోరణిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ నాయకుడు ఆత్మహత్య చేసుకున్నా, అసలు కారణాలను వెలికితీయకుండా రాజకీయ లాభనష్టాల కోసం రోడ్డెక్కి నిరసనలు చేయడం సరైన పద్ధతి కాదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలపై ఒత్తిడి తెచ్చే సందర్భాల్లో…

Read Full News

ఎన్‌హెచ్ఆర్‌సీ, మహిళా కమిషన్ స్పందనతో కేసు కీలక మలుపు – 25 కోట్ల ఆరోపణలు నిరాధారమని స్పష్టం

ఇటీవల చోటు చేసుకున్న వివాదంపై స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారానికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా ఒక మహిళ–ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత ఘటన మాత్రమేనని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ విషయంలో తుది నిర్ణయం కోర్టు పరిధిలోనే ఉంటుందని వెల్లడించారు. ప్రెస్‌మీట్ ప్రారంభంలో, ఇప్పటివరకు తమకు మద్దతుగా నిలిచిన మిత్రులకు, మీడియాకు, అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు….

Read Full News

తెలంగాణ రాజకీయాల్లో అంతర్గత యుద్ధం: మీడియా గ్యాంగులు, స్కాములు, ఫోన్ ట్యాపింగ్ డైవర్షన్‌లపై సంచలన ఆరోపణలు

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు తీవ్ర గందరగోళ స్థితికి చేరుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో లేని సమయంలో క్యాబినెట్ సమావేశం నిర్వహించడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీలోనే నాయకుల మధ్య తీవ్ర అసమన్వయం బయటపడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి వర్గం, ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం, భట్టి విక్రమార్క వర్గం మధ్య స్పష్టమైన విభేదాలు ఉన్నాయని వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా, తెలంగాణలో మీడియా రెండు శిబిరాలుగా చీలిపోయిందన్న ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి….

Read Full News

గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో వీరమరణం పొందిన మహిళా కానిస్టేబుల్ సౌమ్య – తెలంగాణకు గర్వకారణం

నిజంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి చాలా బాధాకరమైన రోజు. గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో విధి నిర్వహణలో ఉండగానే మహిళా కానిస్టేబుల్ సౌమ్య దుండగుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముఠాను పట్టుకునే ప్రయత్నంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సౌమ్య గారు ఎంతో సిన్సియర్‌గా, బాధ్యతతో విధులు నిర్వహించే పోలీస్ అధికారి. గంజాయి ముఠా తప్పించుకునే ప్రయత్నంలో ఆమెపై దాడి చేయగా తీవ్రంగా గాయపడిన సౌమ్యను ఆసుపత్రికి…

Read Full News

బీసీలకు 42% రిజర్వేషన్: హామీ నుంచి మోసం దాకా – కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం

బీసీలకు 42% రిజర్వేషన్: హామీ నుంచి మోసం దాకా – కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశం ఇప్పుడు తీవ్ర రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారింది. బీసీ సంఘాలు, ఉద్యమకారులు, మేధావులు వరుసగా ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత కనిపిస్తున్న నిర్లక్ష్యం—ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం బీసీ సమాజంలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తోంది. కామారెడ్డి…

Read Full News

నామినేషన్‌కు హౌస్ టాక్స్ ఎన్ఓసి తప్పనిసరా? స్పష్టమైన నియమాలు చూపాలంటూ అభ్యర్థుల ప్రశ్న

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియపై తీవ్ర గందరగోళం నెలకొంది. నామినేషన్ వేయాలంటే తప్పనిసరిగా హౌస్ టాక్స్ ఎన్ఓసి తీసుకురావాలనే నిబంధన ఎక్కడ ఉందో స్పష్టంగా చూపాలని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన ఫారం, చెక్‌లిస్ట్‌లో ఎక్కడా హౌస్ టాక్స్ చెల్లించాలి లేదా ఎన్ఓసి తీసుకురావాలనే నిబంధన లేదని అభ్యర్థులు అంటున్నారు. అలాంటప్పుడు తమను ఎందుకు చెల్లింపులు చేయమంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాదకుల విషయంలో కూడా ఒక్కరు సరిపోతారని బుక్‌లో ఉన్నప్పుడు ఇద్దరు ప్రతిపాదకులు కావాలంటూ…

Read Full News

ఫోన్ టాపింగ్ వ్యవహారంపై బీఆర్‌ఎస్‌లో అంతర్గత దయ్యాలు: సంతోష్ రావుపై తీవ్ర ఆరోపణలు, కవిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్

తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ టాపింగ్ అంశం మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. బీఆర్‌ఎస్ పార్టీ అంతర్గత పరిణామాలు, ఉద్యమకారులకు దూరమవుతున్న పార్టీ పరిస్థితిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారానికి కేంద్రబిందువుగా సంతోష్ రావు ఉన్నాడని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ ఉద్యమ నాయకులు, అమరవీరుల కుటుంబాలు, పేద ప్రజలకు దూరమవడానికి కారణం ఒక వ్యక్తి చుట్టూనే రాజకీయాలు తిరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈటల రాజేందర్ వంటి సీనియర్ నాయకులు పార్టీ విడిచిపోవడానికి కూడా ఇదే…

Read Full News

రేవంత్ రెడ్డిపై అనవసర ఆరోపణలు చేస్తే ఊరుకోం: కవితకు కాంగ్రెస్ నేతల గట్టి హెచ్చరిక

తెలంగాణలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. బీఆర్‌ఎస్ నేత కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనవసర ఆరోపణలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని వారు స్పష్టం చేశారు. గతంలో కవిత బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్న సమయంలోనే ఆమె మాటలు, వ్యవహారశైలిపై పలుమార్లు ఖండించామని కాంగ్రెస్ నేతలు గుర్తు చేశారు. ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు కోసం, వ్యక్తిగత సమస్యల నేపథ్యంలో బయటికి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్…

Read Full News

ఫోన్ ట్యాపింగ్, సింగరేణి స్కామ్, విచారణల పేరిట రాజకీయ దాడులు: బిఆర్ఎస్ నేతల తీవ్ర ఆరోపణలు

భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నెహ్రూ కాలం నుంచి నేటి మోడీ ప్రభుత్వ దాకా గూఢచారి, నిఘా వ్యవస్థలు నిరంతరం పనిచేస్తూనే ఉన్నాయని బిఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. దేశ భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు నిఘా వ్యవస్థలు అవసరమేనని, అయితే వాటిని రాజకీయ కక్ష సాధింపుకు వాడటం ప్రమాదకరమని వారు హెచ్చరిస్తున్నారు. 2015లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి 50 లక్షల రూపాయలతో వచ్చిన వ్యక్తి పట్టుబడ్డ…

Read Full News