మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ దూకుడు: అభివృద్ధి పేరుతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు

తెలంగాణలో రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకోబోతోందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రజలు స్పష్టమైన నిర్ణయానికి వచ్చారని, అభివృద్ధి జరగాలంటే బీజేపీకే అధికారాన్ని ఇవ్వాలని భావిస్తున్నారని వారు చెబుతున్నారు. గతంలో బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని బీజేపీ ఆరోపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను అభివృద్ధికి వినియోగించకుండా అవినీతి, అక్రమాలకు దారి మళ్లించారని విమర్శలు గుప్పిస్తోంది….

Read Full News

ఆర్మూరు ప్రజలకు నిధులు ఇస్తారా? లేక మీ కొడంగల్‌కే పరిమితమా?

ఎన్నికల ముందు ఆర్మూరును గెలవాలనే ఉద్దేశంతో ఎన్నో హామీలు ఇచ్చారు.ఈ రోజు ప్రశ్న ఒక్కటే — ఆ హామీలు నెరవేరాయా?నిధులు వచ్చాయా?లేదా ఇప్పుడు మళ్లీ మున్సిపల్ ఎన్నికల్లో కొత్త మాటలతో ప్రచారం చేస్తున్నారా? ఆర్మూరు ప్రజలకు నేను ముందుగా ఇచ్చింది భయంలేని జీవితం.ఒకప్పుడు అక్కడ భయానక వాతావరణం ఉండేది.దాడులు, అక్రమ కేసులు, దళితులపై అణచివేత, మహిళలపై దురాగతాలు —ప్రజలు స్వేచ్ఛ అంటే ఏమిటో కూడా మరిచిపోయిన పరిస్థితి. ఈ రోజు ఆర్మూరు ప్రశాంతంగా ఉంది.భయం లేదు, బానిసత్వం…

Read Full News

ఆర్మూర్‌కు నిధులు ఎక్కడ? హామీల అమలుపై ఎమ్మెల్యే ప్రశ్నలు, మున్సిపల్ ఎన్నికల వేడి

ఆర్మూర్ నియోజకవర్గంలో నిధులు, హామీలు, భద్రత, రాజకీయ ఆరోపణల అంశాలపై రాజకీయ వేడి మరింత పెరిగింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రిని ఆర్మూర్ ప్రజలకు నిధులు ఇవ్వాలని ప్రశ్నించానని, కానీ ఇప్పటివరకు తగిన స్థాయిలో నిధులు రాలేదని ఆర్మూర్ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై ప్రజలు ప్రశ్నిస్తున్నారని, ఆ హామీలను నెరవేర్చే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఆర్మూర్‌లో తన ప్రధాన విజయంగా భయరహిత వాతావరణం నెలకొల్పడాన్ని ఎమ్మెల్యే ప్రస్తావించారు. గతంలో అక్రమ కేసులు, గుండాగిరి,…

Read Full News

“నిజామాబాద్ నుంచే గులాబీ గర్జన.. ఆర్మూర్‌లో వన్‌సైడ్ వార్ – కేసీఆర్ పేరుతో ప్రత్యర్థులపై తీవ్ర దాడి”

2001లో తెలంగాణ ఉద్యమం మొదలైన నాటి నుంచే నిజామాబాద్ జిల్లా కేసీఆర్‌కు అండగా నిలిచిందని బీఆర్‌ఎస్ నేతలు గుర్తు చేశారు. ఆ రోజుల్లోనే నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ పదవి దక్కిందని, అదే రాజకీయ ఊపు ఇప్పుడు మళ్లీ వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల బోధన్‌లో నిర్వహించిన సమావేశంలో గులాబీ జెండా ఎగిరేసినట్టుగా, నిజామాబాద్ అర్బన్‌లో కూడా బీఆర్‌ఎస్‌దే కీలక పాత్రగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా ఆర్మూర్ నియోజకవర్గంపై మాట్లాడిన నేతలు, అక్కడ ఎన్నికలు పూర్తిగా…

Read Full News

భూపాలపల్లిలో బీఆర్‌ఎస్ నేతల ఫైర్ స్పీచ్: హామీలు అమలు చేయని కాంగ్రెస్‌పై ఘాటు ఆరోపణలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన భారీ బహిరంగ సభలో బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎండ తీవ్రతను లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రసంగాన్ని ప్రారంభించారు. భూపాలపల్లి అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో ప్రజలందరికీ తెలుసని నేతలు స్పష్టం చేశారు. మెడికల్ కాలేజ్, డిగ్రీ–జూనియర్ కాలేజీలు, బస్ డిపో, మున్సిపాలిటీ, గల్లీ గల్లీకి రోడ్లు, ఇంటింటికి నీరు, సింగరేణి క్వార్టర్లు,…

Read Full News

కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రెస్ జీవన్ రెడ్డి : బిఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం

ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండని నేతగా బిఆర్ఎస్‌లో మొదట వినిపించే పేరు జీవన్ రెడ్డి అని రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచార చివరి రోజున ఆర్మూర్‌లో ఓకే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఆయన, రానున్న ప్రభుత్వం ఖచ్చితంగా బిఆర్ఎస్‌దేనని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో బిఆర్ఎస్ మళ్లీ…

Read Full News

కేసీఆర్ కిట్, బతుకమ్మ చీరలు తీసేయడం దుర్మార్గం: కాంగ్రెస్ ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, ముఖ్యంగా మహిళలు, పేదలు, కార్మిక వర్గాలను తీవ్రంగా మోసం చేస్తోందని సిరిసిల్ల ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జ్యోతినగర్, జమ్మికుంట ప్రాంతాల్లో నిర్వహించిన సభలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గర్భిణీ స్త్రీలను ఇంటి దగ్గర నుంచి ఆసుపత్రికి తరలించి, ప్రసవం అనంతరం కేసీఆర్ కిట్ అందించడంతో…

Read Full News

ఎన్నికల సాకుతో రైతు భరోసాకు వాయిదా? సీఎం రేవంత్ రెడ్డి హామీలపై రైతుల్లో అనుమానాలు

మున్సిపల్ ఎన్నికల సాకుతో రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని మరోసారి వాయిదా వేయడంపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్నికలు పూర్తైన తర్వాత రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత అనుభవాల నేపథ్యంలో సీఎం మాటలు నమ్మదగినవేనా అనే చర్చ గ్రామీణ ప్రాంతాల్లో జోరుగా సాగుతోంది. ఇదివరకూ కూడా అనేకసార్లు రైతు భరోసా హామీలు ఇచ్చారని, కానీ వాటి అమలు మాత్రం…

Read Full News

జనసేనతో పొత్తు బీజేపీకి భారమేనా? తెలంగాణలో పవన్ కళ్యాణ్ అంశం కమలం పార్టీలో కలవరం

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ–జనసేన పొత్తు అంశం ఇప్పుడు కమలం పార్టీలోనే తీవ్ర చర్చకు దారి తీస్తోంది. రాష్ట్రంలో జనసేనతో పొత్తు లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని బీజేపీలోని మెజారిటీ నేతలు బహిరంగంగానే ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా తెలంగాణ వాదులుగా గుర్తింపు ఉన్న బీజేపీ నాయకులు ఈ పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది. స్వరాష్ట్ర ఉద్యమ కాలంలో ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ తెలంగాణ ప్రజల మదిలో ఉన్నాయని…

Read Full News

స్పీకర్ తీర్పుకు–కాంగ్రెస్ ప్రచార కమిటీలకు మధ్య విరుద్ధతలు: అర్కేపూడి గాంధీ వ్యవహారంలో రాజకీయ నాటకం బయటపడిందా?

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న 116 మున్సిపాలిటీలు మరియు 7 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ప్రచారాన్ని సమన్వయం చేయడానికి కోఆర్డినేటర్లను నియమించింది. ఈ నియామకాలకు ఏఐసిసి తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఆమోదముద్రతో టీపీసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధికారిక జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు మాజీ ఎమ్మెల్యే టి. జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే అర్కేపూడి గాంధీ, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, కార్పొరేషన్…

Read Full News