ఓటర్ జాబితా సవరణలో గందరగోళం.. బీఎల్ఓలు కనిపించడంలేదంటూ ప్రజల ఆందోళన, గడువు పొడిగించాలని డిమాండ్
రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. జూలై 25లోపు దరఖాస్తులు సమర్పించాలని ఎన్నికల అధికారులు సూచించినప్పటికీ, చాలా ప్రాంతాల్లో బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు) ఇంటింటికీ వెళ్లకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సుదర్శన్ రెడ్డి జూలై 25లోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని ఓటర్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ అనేక…

