ఒలింపిక్సే కబడ్డీ తదుపరి లక్ష్యం.. ప్రపంచ దేశాల్లో కబడ్డీని విస్తరించాలి: బల్గేరియా కబడ్డీ ఫెడరేషన్ అధ్యక్షుడు డా. అమన్ సోహల్

హైదరాబాద్: కబడ్డీని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలు, శిక్షణ, భద్రతా నిబంధనలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని బల్గేరియా కబడ్డీ ఫెడరేషన్ అధ్యక్షుడు డా. అమన్ సోహల్ అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్ సమావేశానికి హాజరైన ఆయన.. భవిష్యత్ కబడ్డీ అభివృద్ధిపై తన అభిప్రాయాలను వెల్లడించారు. డా. అమన్ సోహల్ బల్గేరియాలోని ఇండియన్ అసోసియేషన్‌కు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిపారు. బల్గేరియాలో 10 వేల మందికి పైగా భారతీయులకు ఈ అసోసియేషన్ ద్వారా…

Read Full News

22 దేశాల ప్రతినిధులతో కబడ్డీకి కొత్త ఊపు.. ఒలింపిక్సే మా విజన్: యూరప్ కబడ్డీ ప్రతినిధి

హైదరాబాద్: అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్ (IKF) ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి 22 దేశాల ప్రతినిధులతో కలిసి భారత్‌కు రావడం ఎంతో ఉత్సాహంగా ఉందని యూరప్‌కు చెందిన కబడ్డీ ప్రతినిధి తెలిపారు. IKF నుంచి తమకు లభిస్తున్న సహకారం వల్ల యూరప్‌లో కబడ్డీని మరింత విజయవంతంగా అభివృద్ధి చేయగలుగుతున్నామని చెప్పారు. 22 దేశాల ప్రతినిధులతో భారత్‌కు చాలా సంవత్సరాల తర్వాత భారత్‌కు రావడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. తనతో పాటు 22 దేశాలకు చెందిన ప్రెసిడెంట్లు,…

Read Full News

ఒలింపిక్స్‌లో కబడ్డీని చూడాలన్నదే మా కల.. కసాని ప్రయత్నాలతో కొత్త ఆశలు: కెనడా కబడ్డీ అసోసియేషన్ ఫౌండర్ పార్మిందర్ శర్మ

హైదరాబాద్: కబడ్డీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై కెనడా కబడ్డీ అసోసియేషన్ ఫౌండర్, ప్రెసిడెంట్, డైరెక్టర్ పార్మిందర్ శర్మ హర్షం వ్యక్తం చేశారు. దాదాపు 20 ఏళ్లుగా కబడ్డీ కోసం పనిచేస్తున్నానని ఆయన తెలిపారు. గతంలో అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్ (IKF)తో కలిసి పనిచేసిన సంస్థలు, క్లబ్బులు, ఫౌండేషన్లు వేర్వేరుగా ఏర్పడినప్పటికీ.. ప్రస్తుతం వాటిని ఒకే వేదిక కిందకు తీసుకురావడం మంచి ప్రయత్నమని అన్నారు. కబడ్డీని తదుపరి ఒలింపిక్స్‌, కామన్వెల్త్ స్థాయికి తీసుకెళ్లాలన్నదే తమ కల…

Read Full News

కబడ్డీని ఒలింపిక్స్‌కు తీసుకెళ్లడమే మా కల.. యూరప్‌లో కోచ్‌లు, నిధుల కొరతే ప్రధాన సవాళ్లు: జర్మనీ ప్రతినిధి ఇంద్రజీత్ సింగ్ జోసన్

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కబడ్డీని విస్తరించి.. ఒలింపిక్స్‌ స్థాయికి తీసుకెళ్లడమే అన్ని కబడ్డీ ఫెడరేషన్ల ప్రధాన లక్ష్యమని జర్మనీకి చెందిన కబడ్డీ ప్రతినిధి ఇంద్రజీత్ సింగ్ జోసన్ తెలిపారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్‌ (IKF) సమావేశంలో పాల్గొన్న ఆయన.. కసాని జ్ఞానేశ్వర్‌ చొరవపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచ ఫెడరేషన్లను ఒకే వేదికపైకి తీసుకురావడం గొప్ప విషయం ప్రపంచంలోని మూడు కబడ్డీ ఫెడరేషన్ల ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకువచ్చినందుకు కసాని జ్ఞానేశ్వర్‌కు ఇంద్రజీత్ సింగ్ జోసన్ ధన్యవాదాలు…

Read Full News

తాంజానియాలో కబడ్డీకి కొత్త ఊపు.. స్కూళ్ల నుంచే యువ ప్రతిభను వెలికితీస్తాం: తాంజానియా కబడ్డీ ప్రతినిధులు

హైదరాబాద్: భారతదేశంలో జరుగుతున్న అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్‌ (IKF) సమావేశంలో పాల్గొన్న తాంజానియా కబడ్డీ ప్రతినిధులు.. తమ దేశంలో కబడ్డీని మరింత అభివృద్ధి చేసేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తామని తెలిపారు. హైదరాబాద్‌కు ఆహ్వానించిన IKF, కసాని జ్ఞానేశ్వర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తాంజానియా కబడ్డీ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అబ్దల్లా ముస్తఫా న్యోని, ఉపాధ్యక్షుడు మొహమ్మద్ జెంజా సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తాంజానియాలో కబడ్డీ భవిష్యత్తు, యువతలో క్రీడపై ఆసక్తి, భారత్‌తో సహకారం వంటి అంశాలపై వారు…

Read Full News

హైదరాబాద్‌కు వచ్చి కబడ్డీపై ఆసక్తి.. యువత కబడ్డీని ముందుకు తీసుకెళ్లాలి: అంతర్జాతీయ ప్రతినిధి

హైదరాబాద్: అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్‌ సమావేశం కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఓ కబడ్డీ ప్రతినిధి నగరానికి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఉండటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్‌ ద్వారా కబడ్డీ క్రీడను మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. ఫెడరేషన్‌లోని సభ్యులు, ప్రతినిధులు కలిసి పనిచేస్తే కబడ్డీ మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని అభిప్రాయపడ్డారు. యువత కబడ్డీ వైపు రావాలి కబడ్డీపై యువతకు మరింత ఆసక్తి కల్పించాల్సిన అవసరం ఉందని…

Read Full News