News
గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి బాధ్యతలు జేఎస్ రంజన్కు: 24 మంది ఐఏఎస్ల బదిలీలు
గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి బాధ్యతలు జేఎస్ రంజన్కు: 24 మంది ఐఏఎస్ల బదిలీలు హైదరాబాద్ను మరింత సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంతో అతి పెద్ద నగరంగా మారిన గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి బాధ్యతలను ప్రత్యేకంగా పర్యవేక్షించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ (జేఎస్ రంజన్)కు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర మెట్రోపాలిటన్ పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA)కి సంబంధించిన…
అవినీతి కేసుల్లో ఇద్దరు మంత్రులు జైలుకే: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
అవినీతి కేసుల్లో ఇద్దరు మంత్రులు జైలుకి వెళ్లడం ఖాయం: కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెంచుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు మంత్రులు అవినీతి కేసుల్లో తప్పకుండా జైలుకు వెళ్లనున్నారని ఆయన స్పష్టం చేశారు. చట్టంలోని లొసుగులను ఆశ్రయించుకొని ఆ ఇద్దరు మంత్రులు వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు….
ఫోన్ ట్యాపింగ్ కేసు క్లైమాక్స్కు చేరిందా? కేసీఆర్–హరీష్ రావులకు సిట్ నోటీసులు దాదాపు ఖాయం!
ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు చేరిందా? కేసీఆర్–హరీష్ రావులకు సిట్ నోటీసులు దాదాపు ఖాయం తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) దర్యాప్తు ఇప్పుడు తుది అంకానికి చేరిందన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు పేర్లు వాంగ్మూలాల్లో రావడంతో వారిని విచారణకు పిలిచే అంశం దాదాపు ఖరారైనట్టేనని…
సాఫ్ట్వేర్ గర్ల్ఫ్రెండ్ – బద్మాష్ బాయ్ఫ్రెండ్.. డ్రగ్స్ దందాతో చిక్కడపల్లిలో షాకింగ్ అరెస్ట్!
చిక్కడపల్లి ప్రాంతంలో డ్రగ్స్ నెట్వర్క్ను పోలీసులు గుట్టురట్టు చేశారు. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్న సుష్మిత అనే యువతి, తన బాయ్ఫ్రెండ్ ఇమాన్యుల్తో కలిసి డ్రగ్స్ దందా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉద్యోగం చేస్తూనే లగ్జరీ జీవనశైలికి అలవాటు పడిన సుష్మిత, యువతను టార్గెట్ చేసుకుని మత్తుపదార్థాల విక్రయాలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. చిక్కడపల్లి పరిధిలో గుట్టుగా సాగుతున్న ఈ అక్రమ వ్యాపారంపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో సుష్మిత, ఇమాన్యుల్తో పాటు…
కొట్టలగూడ–లాసింగ్ తాండా గ్రామాల అభివృద్ధికి పూర్తి బాధ్యత నాది: వికారాబాద్ ఎమ్మెల్యే స్పష్టం
కొత్తగా ఎన్నికైన మహిళా సర్పంచులు, వార్డు సభ్యులకు అభినందనలు తెలుపుతూ వికారాబాద్ నియోజకవర్గంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లాసింగ్ తాండా, కొట్టలగూడ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. సభను ఉద్దేశించి మాట్లాడిన వికారాబాద్ ఎమ్మెల్యే, కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులందరికీ చప్పట్లతో అభినందనలు తెలియజేయాలని పిలుపునిచ్చారు. కొట్టలగూడ, లాసింగ్ తాండా గ్రామాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అందించే పూర్తి బాధ్యత తనదేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో…
బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను ఖండిస్తూ వికారాబాద్లో కొవ్వత్తుల ర్యాలీ
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ భారతదేశ వ్యాప్తంగా హిందూ సంఘాలు నిరసనలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ (విహెచ్పీ) ఆధ్వర్యంలో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ హిందూ సంఘాల నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. గత ఆగస్టు నెల నుంచి బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై వరుస దాడులు జరుగుతున్నాయని, ఇది తీవ్రంగా ఆందోళన కలిగించే అంశమని వక్తలు పేర్కొన్నారు. మతపరమైన గుర్తింపు…
ఫీజు రీయింబర్స్మెంట్పై బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆగ్రహం.. 10 వేల కోట్లు వెంటనే చెల్లించాలి: ఎస్. దుర్గయ్యగౌడ్
బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ ఎస్. దుర్గయ్యగౌడ్ ఆరోపించారు. హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ కింద సుమారు రూ.10 వేల కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. నిన్న ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.365.75 కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారని, అయితే…
కేసీఆర్ ప్రెస్ మీట్పై కాంగ్రెస్ ఫైర్.. 10 ఏళ్ల పాలనలో ఒక్క అభివృద్ధి చూపించండి: చెన్నగాని దయాకర్
ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు సంవత్సరాల విరామం తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఓకే టీవీకి ఇచ్చిన ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో టీపీసీసీ అధికార ప్రతినిధి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెన్నగాని దయాకర్ కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రెస్ మీట్ పూర్తిగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలకే పరిమితమైందని, కానీ తన పదేళ్ల పాలనలో తెలంగాణకు చేసిన ఒక్క…
రవాణా శాఖలో అవినీతి తిమింగలం.. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్ వద్ద రూ.200 కోట్ల ఆస్తులు బయటపడ్డాయి
రవాణా శాఖలో భారీ అవినీతి తిమింగలం వెలుగులోకి వచ్చింది. మహబూబ్నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) ఎం. కిషన్ నాయక్ వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు భారీగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఆయన వద్ద ఉన్న ఆస్తుల బహిరంగ మార్కెట్ విలువ సుమారు రూ.200 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కిషన్ నాయక్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఫిర్యాదుల…
న్యూ ఇయర్ వేడుకలపై ఎక్సైజ్ కఠిన ఆంక్షలు.. డ్రగ్స్ వాడితే పీడీ కేసులు, ఈవెంట్ పర్మిషన్ తప్పనిసరి
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాలు, అక్రమ మద్యం వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది. వేడుకల ముసుగులో డ్రగ్స్, గంజాయి, సింథటిక్ డ్రగ్స్ వాడితే పీడీ యాక్ట్ కింద కేసులు తప్పవని అధికారుల గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈవెంట్ పర్మిషన్ లేకుండా వేడుకలు నిర్వహిస్తే నేరుగా జైలుకే పంపిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 27 నుంచి 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించనున్నట్లు ఎక్సైజ్…

