యాదగిరి గుట్టలో ఘనంగా గిరి ప్రదక్షిణ – 25 వేల మంది అయ్యప్ప స్వాముల హాజరు

యాదగిరి గుట్టలో సోమవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా అయ్యప్ప స్వాముల శరణ ఘోష మార్మోగింది.
స్వామే శరణం అయ్యప్ప, నమో నరసింహా” అంటూ భక్తులు భజనలు, కీర్తనలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత వైభవోపేతం చేశారు.

తెల్లవారుజామున 6 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద ప్రారంభమైన గిరి ప్రదక్షిణలో సుమారు 25,000 మంది అయ్యప్ప దీక్షాదారులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ప్రత్యేక పల్లకిలో మోస్తూ, భక్తులు యాదగిరి కొండ చుట్టూ 7.5 కిలోమీటర్ల దూరాన్ని 45 నిమిషాల్లో పూర్తి చేశారు.

కాలినడకన కొండను అధిరోహించిన భక్తులు అనంతరం గర్భాలయంలోని స్వయంభూ నరసింహుని దర్శనం చేసుకుని పుణ్యఫలం పొందారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాలాదారులకు ఆలయ అధికారులు 3 లక్షల రూపాయల విలువైన 230 కిలోల లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేసినట్లు తెలిసింది.

ఈ సందర్భంగా యాదగిరి గుట్ట పరిసరాలు భక్తుల నినాదాలతో, భజనా గోషాలతో ఆధ్యాత్మిక క్షేత్రంలా మారిపోయాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *